News October 9, 2024
బాబుకు చింత చచ్చినా పులుపు చావలేదు: రోజా

AP: CM చంద్రబాబు తీరు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుందని YCP నేత రోజా ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూపై కల్తీ ఆరోపణలు చేసి హిందువుల మనోభావాలు గాయపరిచారని మండిపడ్డారు. ‘CBI సిట్ వేసిన సుప్రీం రాజకీయ విమర్శలు చేయొద్దని ఆదేశించింది. కానీ దానిపై తాను మాట్లాడకుండా తన అనుకూల మీడియాలో కల్తీ వార్తలు ప్రచారం చేయిస్తున్నారు. కల్తీ రాజకీయాలు చేసేవారే కల్తీ ప్రచారాన్ని నమ్ముతారు’ అని ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News July 8, 2025
‘నవోదయ’లో ప్రవేశాలకు కొన్ని రోజులే గడువు

2026-27 విద్యాసంవత్సరానికి 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో క్లాసులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదో తరగతి పూర్తయినవారు, ఈ ఏడాది అదే క్లాసు చదువుతున్నవారు అర్హులు. AP, TG సహా పలు రాష్ట్రాల్లో డిసెంబర్ 13న, పర్వత ప్రాంత రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. cbseitms.rcil.gov.in/nvs వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News July 8, 2025
18 రోజుల్లో కుబేర కలెక్షన్లు ఎంతంటే?

నాగార్జున, ధనుష్, రష్మిక కాంబోలో వచ్చిన ‘కుబేర’ సినిమా మిక్స్డ్ టాక్తో థియేటర్లలో రన్ అవుతోంది. గత నెల 20న రిలీజైన ఈ మూవీ వారంలోనే రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు మూవీ టీం ప్రకటించింది. ఆ తర్వాత పలు సినిమాలు రిలీజ్ కావడంతో కలెక్షన్లు తగ్గాయి. సినిమా రిలీజై నేటికి 18 రోజులు కాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ.134.25 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
News July 8, 2025
CBSE: సప్లిమెంటరీ హాల్టికెట్లు విడుదల

10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లను CBSE రిలీజ్ చేసింది. ప్రైవేట్ విద్యార్థులు వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. రెగ్యులర్ స్టూడెంట్స్ తమ స్కూళ్లలో హాల్ టికెట్లు కలెక్ట్ చేసుకోవాలని పేర్కొంది. కాగా ఈనెల 15 నుంచి 10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షలు మొదలవుతాయి. 10 నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.