News October 9, 2024

బాబుకు చింత చచ్చినా పులుపు చావలేదు: రోజా

image

AP: CM చంద్రబాబు తీరు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుందని YCP నేత రోజా ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూపై కల్తీ ఆరోపణలు చేసి హిందువుల మనోభావాలు గాయపరిచారని మండిపడ్డారు. ‘CBI సిట్‌ వేసిన సుప్రీం రాజకీయ విమర్శలు చేయొద్దని ఆదేశించింది. కానీ దానిపై తాను మాట్లాడకుండా తన అనుకూల మీడియాలో కల్తీ వార్తలు ప్రచారం చేయిస్తున్నారు. కల్తీ రాజకీయాలు చేసేవారే కల్తీ ప్రచారాన్ని నమ్ముతారు’ అని ఆమె ట్వీట్ చేశారు.

Similar News

News December 15, 2025

హిమాలయాల్లో అణు పరికరం.. పొంచి ఉన్న ప్రమాదం!

image

1965లో చైనా అణు కార్యక్రమంపై నిఘా కోసం అమెరికా CIA భారత్‌తో కలిసి హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరం ఏర్పాటుచేయాలని భావించింది. మంచు తుఫానుతో ప్లుటోనియం ఉన్న పరికరాన్ని అక్కడే వదిలేశారు. తర్వాత వెళ్లి వెతికినా అది కనిపించలేదు. హిమానీనదాలు కరిగి ఆ పరికరం దెబ్బతింటే నదులు కలుషితం అవ్వొచ్చని సైంటిస్టులు తెలిపారు. తాజాగా బీజేపీ MP నిశికాంత్ ట్వీట్‌తో ఈ వార్త వైరలవుతోంది.

News December 15, 2025

రేపు ఉదయం దట్టమైన పొగమంచు.. జాగ్రత్త

image

తెలంగాణలో రేపు దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు, సెంట్రల్ తెలంగాణ జిల్లాల ప్రజలు రేపు ఉదయం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హైవేలపై ప్రయాణం చేసే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని, వీలైతే బయటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే కోల్డ్ వేవ్ కండిషన్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Share it

News December 15, 2025

వాస్తు నియమాలు ఎందుకు పాటించాలి?

image

ప్రకృతి, మానవ జీవన మనుగడలను సమన్వయం చేస్తూ మనల్ని రక్షించే శాస్త్రమే ‘వాస్తు’ అని, మన క్షేమం కోసం వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని అంటున్నారు. పరిసరాల వాస్తు కూడా ముఖ్యమే అంటున్నారు. వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుందని కుటుంబలో ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తాయని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>