News October 9, 2024
బాబుకు చింత చచ్చినా పులుపు చావలేదు: రోజా

AP: CM చంద్రబాబు తీరు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుందని YCP నేత రోజా ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూపై కల్తీ ఆరోపణలు చేసి హిందువుల మనోభావాలు గాయపరిచారని మండిపడ్డారు. ‘CBI సిట్ వేసిన సుప్రీం రాజకీయ విమర్శలు చేయొద్దని ఆదేశించింది. కానీ దానిపై తాను మాట్లాడకుండా తన అనుకూల మీడియాలో కల్తీ వార్తలు ప్రచారం చేయిస్తున్నారు. కల్తీ రాజకీయాలు చేసేవారే కల్తీ ప్రచారాన్ని నమ్ముతారు’ అని ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News December 19, 2025
రోజూ గుడ్లు పెట్టే కోళ్ల గురించి తెలుసా?

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయి. సంవత్సరానికి 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18 నుంచి 20 వారాల పాటు పెంచిన తర్వాత గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. గోధుమ రంగులో ఉండే ఈ గుడ్లు పెద్దగా ఉంటాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు.
News December 19, 2025
సర్పంచ్ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు!

TG: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఘటన జరిగింది. సర్పంచ్ బరిలో నిలిచిన ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ రాలేదు. వరంగల్(D) ఖానాపురం(M) కీర్యాతండాలో ఈ నెల 17న సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 239 ఓట్లు పోలవగా BJP బలపరిచిన బోడ గౌతమికి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. చివరికి నోటాకు ఒక ఓటు పోలైంది. దీంతో ఆమె తనకు తానూ ఓటు వేసుకోలేదా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ INC అభ్యర్థి విజయ గెలిచారు.
News December 19, 2025
అది దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి: హరీశ్ రావు

TG: ఉపాధి పథకానికి గాంధీ పేరు తొలగింపుపై BRS నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఇది దేశ సమాఖ్య వ్యవస్థపై జరిపిన ప్రత్యక్ష దాడి అని అభివర్ణించారు. గాంధీ పేరును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక 60:40 నిధుల నిష్పత్తిని తెరపైకి తెచ్చిన కేంద్రం ఈ పథకాన్ని నీరుగార్చాలని చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల అధికారాలను తగ్గిస్తూ తన పెత్తనాన్ని పెంచుకోవడానికి ఈ బిల్లును ఆయుధంగా వాడుకుంటోందన్నారు.


