News August 3, 2024
ఘోరం: తల్లికి చీమలు.. పట్టించుకోని కొడుకులు

TG: ఇద్దరు కొడుకులున్నా ఏం ప్రయోజనం? ఆ తల్లి జీవచ్ఛవంలా మంచం పట్టింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన కొమరమ్మ(73) పెద్ద కొడుకు వరంగల్లో ఉండగా, ఆమె చిన్న కొడుకుతో ఉంటున్నారు. ఇటీవల ఆమె కింద పడి గాయాలపాలు కావడంతో ఆస్పత్రిలో చూపించి, చికిత్స పూర్తికాక ముందే ఇంటికి తీసుకొచ్చేశారు. మంచం పట్టిన ఆ తల్లిని చీమలు తింటున్నా కొడుకు, కోడలు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 4, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అరియర్లపై గుడ్న్యూస్

AP: డీఏ అరియర్స్ బిల్లులను సమర్పించడంలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు నెల రోజుల్లో ఆదేశాలిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. పెన్షనర్లు, CPS ఉద్యోగులకు ప్రభుత్వం 2018 జులై నుంచి DA అరియర్లు చెల్లించగా, పలు కారణాలతో చాలా మందికి అవి అందలేదు. దీంతో CFMSలో అరియర్స్ బిల్లులను తిరిగి సమర్పించే వెసులుబాటు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.
News March 4, 2026
డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, SPSR నెల్లూరులో ఉద్యోగాలు

<
News March 4, 2026
పంచాయతీల్లో ‘పంచాయితీ’!

TG: 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల్లో చిచ్చు పెట్టాయి. ప్రతి ఊరికి రూ.6లక్షలు జమ కాగా వీటిని పాత బిల్లుల చెల్లింపులకూ వాడాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతంలో తాము ఖర్చు చేసిన బకాయిలు చెల్లించాలని పాత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిధులను కొత్త పనులకే వెచ్చిస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నిత్యం గొడవలే జరుగుతున్నాయి.


