News September 27, 2024

IPL అభిమానులకు బ్యాడ్ న్యూస్?

image

IPL-2025లో మ్యాచ్‌ల సంఖ్యను 84కు పెంచేది లేదని BCCI తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరి 74 మ్యాచ్‌లే ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా వచ్చే సీజన్‌లో 84 మ్యాచ్‌లు ఆడించాలని గతంలో BCCI యోచించింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News October 30, 2025

రాబోయే 2-3 గంటల్లో వర్షం

image

TG: నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మేడ్చల్, మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మీ ప్రాంతంలో వాన కురుస్తోందా?

News October 30, 2025

నేడే కీలక పోరు.. భారత్ గెలిచేనా?

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇవాళ భారత్, ఆస్ట్రేలియా మధ్య మ.3 గంటల నుంచి సెమీ ఫైనల్-2 జరగనుంది. బలమైన AUSను ఎలాగైనా ఓడించాలని IND భావిస్తోంది. షఫాలీ వర్మ రాకతో టాపార్డర్ స్ట్రాంగ్‌గా మారనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నవంబర్ 2న సౌతాఫ్రికాతో ఫైనల్‌లో తలపడనుంది. ODI WCలలో ఇప్పటివరకు IND, AUS 14 మ్యాచుల్లో తలపడగా IND మూడింట్లో మాత్రమే గెలిచింది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

News October 30, 2025

యూట్యూబ్‌ వీడియోలు ఇకపై మరింత స్పష్టంగా!

image

యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లోని LOW రిజల్యూషన్ వీడియోల విజ్యువల్ క్లారిటీని AI సాయంతో మెరుగుపరచనుంది. ఇందుకోసం ‘అప్‌స్కేలింగ్’ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. 1080P కంటే తక్కువ రిజల్యూషన్‌లో అప్‌లోడ్ అయిన వీడియోలను దీని సాయంతో ఇంప్రూవ్ చేస్తారు. ఫ్యూచర్‌లో 4K క్వాలిటీ కంటే బెటర్‌గా కూడా చేయొచ్చని సంస్థ వర్గాలు పేర్కొన్నారు. దీని వల్ల TVలు, వెబ్, మొబైల్ డివైజ్‌లలో వీడియోలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.