News September 2, 2024
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరొకరికి బెయిల్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 23 నెలల తర్వాత AAP నేత విజయ్ నాయర్కు బెయిల్ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కమ్యూనికేషన్ ఇన్ఛార్జి అయిన విజయ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో కస్టడీలో ఉన్నారు. తన బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయ స్థానం తాజాగా ఆయనకు బెయిల్ ఇచ్చింది. విజయ్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మనూ వాదించారు.
Similar News
News July 6, 2025
31 నుంచి సికింద్రాబాద్లో అగ్నివీర్ ర్యాలీ

TG: ఈనెల 31 నుంచి సికింద్రాబాద్ AOC సెంటర్లోని జోగిందర్ స్టేడియంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. జనరల్ డ్యూటీ(జీడీ), టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్మెన్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈవెంట్లు SEP 14 వరకు కొనసాగుతాయి. అటు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ ట్రయల్స్ కూడా నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు AOC సెంటర్ హెడ్క్వార్టర్ను లేదా <
News July 6, 2025
బౌద్ధమత గురువు దలైలామా 90వ జన్మదినం

బౌద్ధమత అత్యున్నత ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా నేడు 90వ జన్మదినం జరుపుకుంటున్నారు. టిబెట్లోని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన టెన్జింగ్ గ్యాట్సో కేవలం ఐదేళ్ల వయసులోనే 14వ దలైలామా అయ్యారు. చైనా ఆక్రమణ తర్వాత 1959లో ఇండియాకి నిర్వాసితుడిగా వచ్చారు. తన సందేశాలతో 1989లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ‘మనసు ప్రశాంతంగా ఉంటే, ప్రపంచమూ ప్రశాంతంగా ఉంటుంది’ అన్న ఆయన మాటలు ఇప్పుడు అన్ని దేశాలకు అవసరం.
News July 6, 2025
ప్రజాప్రతినిధుల సమాచారం సేకరిస్తున్న ప్రభుత్వం

TG: స్థానిక సంస్థల తాజా మాజీ ప్రజాప్రతినిధుల వివరాలను అందించాలని అన్ని జిల్లాల CEOలు, DPOలను ప్రభుత్వం ఆదేశించింది. వార్డు సభ్యుడు, సర్పంచి, MPTC, MPP, ZPTC, ZP ఛైర్మన్ల కులం, ఉపకులం, పార్టీ తదితర వివరాలను రేపటిలోగా సమర్పించాలని పేర్కొంది. గతేడాది చేపట్టిన సర్వే డేటాను విశ్లేషించడానికి ప్రభుత్వం ఓ స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి అవసరమైన సమాచారం కోసమే వివరాలను సేకరిస్తోంది.