News May 11, 2024
బాలకృష్ణ, దత్తపుత్రుడికి ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇచ్చాం: జగన్

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని సీఎం జగన్ విరుచుకుపడ్డారు. ‘బాలకృష్ణ రిషికొండలో, దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నారు. వీరిద్దరిని అడుగుతున్నా.. మీకు ఒరిజనల్ డాక్యుమెంట్లు ఇచ్చారా? జిరాక్సులిచ్చారా? ఏపీలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న 9 లక్షల మందికి ఒరిజనల్ డాక్యుమెంట్లే ఇచ్చాం. చంద్రబాబు కుట్రలతో పథకాల నగదును లబ్ధిదారులకు అందకుండా చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు.
Similar News
News March 14, 2026
US అప్పుడు ఇండియాను బెదిరించి ఇప్పుడు వేడుకుంటోంది: ఇరాన్

రష్యా నుంచి చమురు కొనవద్దని ఇండియాను అమెరికా కొన్ని నెలలపాటు బెదిరించిందని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అరఘ్చి ట్వీట్ చేశారు. ఇరాన్తో 2 వారాల యుద్ధం తర్వాత ఆ పరిస్థితి మారిందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని INDతో సహా మిగతా దేశాలను US వేడుకుంటోందని విమర్శించారు. ఇరాన్పై వార్కు మద్దతిస్తే రష్యాకు వ్యతిరేకంగా US సపోర్ట్ తమకు లభిస్తుందనుకున్న యూరప్కు ఎదురుదెబ్బ తగిలిందన్నారు.
News March 14, 2026
డైరెక్టర్గా శేఖర్ మాస్టర్.. హీరోగా ప్రభుదేవా కుమారుడు?

డాన్స్ కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లుగా మారడం కొత్తేం కాదు. ఇప్పుడు ఈ లిస్టులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేరబోతున్నట్లు సమాచారం. ఆయన తెరకెక్కించే సినిమాతో ప్రభుదేవా కుమారుడు రిషిల్ రాఘవేంద్ర దేవా హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మే నుంచి షూటింగ్ ఉంటుందని, త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలిపాయి. మ్యూజిక్, డాన్స్కి ప్రాధాన్యమున్న స్టోరీతో ఈ మూవీ రానుందట.
News March 14, 2026
ఇరాన్పై దాడులు.. 2 వారాల్లో 2,000 మంది మృతి!

ఇరాన్పై US&ఇజ్రాయెల్ గత 2 వారాలుగా జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ 2వేల మందికి పైగా చనిపోయారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ఈ యుద్ధంలో మరణించిన అమెరికన్ సైనికుల సంఖ్య 11కి చేరింది. ఈ లిస్టులో వెస్టర్న్ ఇరాక్లో క్రాష్ అయిన రీఫ్యుయలింగ్ ఎయిర్క్రాఫ్ట్ సిబ్బంది ఆరుగురు కూడా ఉన్నారు. ఇక తమ దేశంపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 100+ మంది పిల్లలు మరణించినట్లు లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.


