News March 30, 2024
మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి

AP: మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈయన వైసీపీకి రాజీనామా చేసి ఫిబ్రవరిలో జనసేన పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు దక్కాయి. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ పేరును ఇదివరకే ప్రకటించారు. అటు 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పోటీ చేస్తుండగా.. పాలకొండ, అవనిగడ్డ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Similar News
News January 7, 2026
అనకాపల్లి: బీఎల్వోలకు నోటీసుల జారీ

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరించిన బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ వెల్లడించారు. ఎలమంచిలిలోని పోలింగ్ కేంద్రం-46, అచ్యుతాపురం మండలం ఆవ సోమవారంలోని 203, పూడిమడకలోని 228 కేంద్రం పరిధిలోని బీఎల్వోలు ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారికి నోటీసులు జారీ చేశారు.
News January 7, 2026
నేటి ముఖ్యాంశాలు

* ఏపీలో మాల్దీవ్స్ తరహా ఐల్యాండ్ టూరిజమ్: CBN
* స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలు: APSRTC
* ‘రాయలసీమ’పై రేవంత్తో కలిసి CM కుట్ర: YCP
* ఐదు రోజుల పాటు సాగిన TG అసెంబ్లీ, శాసన మండలి
* ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.15,946 కోట్లు: భట్టి
* మార్చిలో అందుబాటులోకి ‘భూ భారతి’ పోర్టల్: పొంగులేటి
* KCR అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుంది: కేటీఆర్
News January 7, 2026
బంగ్లాదేశ్లో మరో హిందువు.. మూక దాడి నుంచి తప్పించుకోలేక..

బంగ్లాదేశ్లో మరో హిందువు బలయ్యాడు. నవ్గావ్లోని మహాదేవ్పూర్లో దొంగతనం చేశాడంటూ మిథున్ సర్కార్(25)ను మూక వెంటాడింది. దీంతో తప్పించుకునే దారి లేక, ప్రాణాలను కాపాడుకునేందుకు అతడు కాలువలోకి దూకాడు. ఈత రాక నీట మునిగి చనిపోయాడు. సాయం కోసం అర్థించినా ఎవరూ కనికరించలేదు. ఇటీవల హిందువులపై ఇలాంటి <<18775269>>ఘటనలు<<>> జరుగుతూనే ఉన్నాయి.


