News December 17, 2024
భిక్షాటనపై నిషేధం.. డబ్బులిస్తే కేసు

ఇండోర్ (MP)లో భిక్షాటనపై ప్రభుత్వం నిషేధం విధించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే ఈ నిబంధనల ప్రకారం భిక్షాటన చేస్తున్న వాళ్లకు డబ్బులు ఇచ్చే వారిపై కూడా FIR నమోదు చేయనున్నారు. యాచించే వారు లేని నగరంగా మార్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. కొన్ని ముఠాలు అమాయక ప్రజల్ని యాచకులుగా మారుస్తున్నాయని చెప్పారు. ఇలాంటి రూల్ మన దగ్గరా వస్తే ఎలా ఉంటుంది?
Similar News
News July 8, 2025
తెరుచుకోనున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు.. 25 ఏళ్లలో రికార్డు

AP: CM చంద్రబాబు ఇవాళ శ్రీశైలం క్రస్ట్గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీరు విడుదల చేయనున్నారు. జులై తొలివారంలోనే డ్యామ్ గేట్లు ఎత్తడం పాతికేళ్లలో ఇదే తొలిసారి. డ్యామ్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80 TMCలు కాగా ప్రస్తుతం 193.4 TMCల నీరుంది. అటు సాగర్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 312.05 TMCలు కాగా.. 164.1 టీఎంసీలున్నాయి. సాగర్కు 67,433 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
News July 8, 2025
రేపు కార్మిక సంఘాల భారత్ బంద్

కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఐక్యవేదిక రేపు (జులై 9) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. బ్యాంకింగ్, పోస్టల్, ఇన్సూరెన్స్ వంటి రంగాలకు చెందినవారు బంద్లో పాల్గొననున్నారు. రైతులతో కలిపి 25 కోట్ల మంది పాల్గొంటారని ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత తెలిపారు. 10ఏళ్లుగా వార్షిక కార్మిక సమావేశం పెట్టకుండా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఆరోపించారు.
News July 8, 2025
గోదావరికి వరద ఉద్ధృతి

AP: శబరి, సీలేరు వరదతో గోదావరి నదిలో ప్రవాహం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద 48 గేట్లు ఎత్తి 1.95 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. అటు ధవళేశ్వరం బ్యారేజీకి 2.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మహారాష్ట్రలో వర్షాలు మరింత ఊపందుకుంటాయని, 3-4 రోజుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.