News May 4, 2024

ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

image

ఉల్లి ధరల్ని నియంత్రణలో ఉంచేందుకు భారత సర్కారు ఉల్లి ఎగుమతిపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తాజాగా పేర్కొంది. ఎగుమతి ధరను టన్నుకు రూ.45,860గా నిర్ణయించింది. నిషేధం వలన తమకు రాబడి తగ్గిందంటూ మహారాష్ట్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Similar News

News March 27, 2026

ఏప్రిల్ 2న పార్లమెంటులో అమరావతి బిల్లుకు ఛాన్స్: చంద్రబాబు

image

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై రేపు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తే ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళ్తుందన్నారు. కుదిరితే ఏప్రిల్ 2నే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా అమరావతిపై జగన్ కుట్రలను ప్రజలకు తెలియజేయాలని మంత్రులకు సూచించారు.

News March 27, 2026

వీటి శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వద్దు

image

మేకప్‌ బ్రష్‌లు, స్పాంజ్‌లకు ఎక్స్‌పైరీ డేట్‌ ఉండదు. కానీ వాటిని ఏడాదికి ఒకసారైనా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. మేకప్‌ టూల్స్‌ను దీర్ఘకాలంపాటు మార్చకుండా ఉంటే వాటి నాణ్యతపై ప్రభావం పడుతుంది. అలాగే వీటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. వేడి నీళ్లు, డిష్‌ వాషర్‌ సోప్‌, యాంటి బ్యాక్టీరియల్‌ సోప్‌, బేబీషాంపూతో వాటిని శుభ్రం చేసుకోవచ్చు.

News March 27, 2026

జీడిమామిడి పిక్కలకు అధిక ధర రావాలంటే..

image

చాలా మంది రైతులు జీడిమామిడి కాయలను పూర్తిగా పండకుండానే చెట్ల నుంచి తీసేస్తున్నారు. దీని వల్ల పిక్కల లోపల పప్పు పూర్తిగా తయారవ్వడంలేదు. ఫలితంగా మార్కెట్‌లో ఆశించిన ధర దక్కడం లేదు. అందుకే తోటల్లో పండు, పిక్కతో సహా కింద పడిన కాయలను మాత్రమే ఏరుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్ల నుంచి పిక్కలను వేరు చేసి.. వాటిని 3 రోజుల పాటు ఎండలో ఆరబెడితే గింజలు మంచి బరువు ఉండి, అధిక ధర లభిస్తుంది.