News May 4, 2024

ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

image

ఉల్లి ధరల్ని నియంత్రణలో ఉంచేందుకు భారత సర్కారు ఉల్లి ఎగుమతిపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తాజాగా పేర్కొంది. ఎగుమతి ధరను టన్నుకు రూ.45,860గా నిర్ణయించింది. నిషేధం వలన తమకు రాబడి తగ్గిందంటూ మహారాష్ట్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Similar News

News January 15, 2026

మునగ సాగుతో ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం

image

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్‌రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్‌లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఉమేశ్ సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.

News January 15, 2026

నేటి నుంచి U-19 వన్డే వరల్డ్ కప్

image

జింబాబ్వేలో నేటి నుంచి ICC U-19 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జులవాయో వేదికగా ఇవాళ భారత జట్టు USAను ఢీకొట్టనుంది. ఇప్పటి వరకు 16 సార్లు టోర్నీ జరగ్గా IND 5 టైటిళ్లు గెలిచింది. ఆరోసారి కప్ సొంతం చేసుకోవాలని ఆయుష్ మాత్రే సారథ్యంలో బరిలోకి దిగుతోంది. ఇక 14ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి నిలిచింది. అటు ఇవాళ ఇతర మ్యాచుల్లో జింబాబ్వే-స్కాట్లాండ్, టాంజానియా-వెస్టిండీస్ పోటీ పడనున్నాయి.

News January 15, 2026

సేంద్రియ సాగుతోనే సక్సెస్

image

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు ఉమేష్ వ్యవసాయం ప్రారంభించారు. రెండు ఎకరాల్లో ఒకవైపు సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నారు. కోడి ఎరువు, మేక ఎరువు, ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా మార్చారు. మార్కెట్ స్టడీ చేసి ఓడీసీ-3 వెరైటీ మునగ మొక్కలను నాటారు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి, ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.