News January 25, 2025
బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: టీపీసీసీ చీఫ్

TG: ఇందిరమ్మ ఇళ్లకు PM ఆవాస్ యోజన పేరు పెట్టాలన్న కేంద్ర మంత్రి <<15254662>>బండి సంజయ్కు<<>> టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. మోదీకి, ఉక్కు మహిళ ఇందిరకు పోలిక ఏంటని ప్రశ్నించారు. పేదల ఇళ్లకు ఇందిర పేరు పెడితే తప్పేంటన్నారు. ఇందిరను అవమానించిన సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం అనడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శనమని తెలిపారు.
Similar News
News February 18, 2025
BREAKING: టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మే నెలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు వీటిని నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20వ తేదీ నుంచి 22 వరకు డబ్బులు చెల్లించాలి. టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇక్కడ <
News February 18, 2025
Stock Markets: ఐటీ తప్ప అన్నీ…

దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. నిఫ్టీ 22,917 (-40), సెన్సెక్స్ 75,920 (-70) వద్ద చలిస్తున్నాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలూ నష్టాల్లోనే ఉన్నాయి. బెంచ్మార్క్ సూచీలు ఇప్పటికే ఓవర్సోల్డ్ జోన్లోకి వెళ్లడంతో కౌంటర్ ర్యాలీకి అవకాశం ఉంది. టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫీ, అపోలో హాస్పిటల్స్, హెచ్సీఎల్ టెక్ టాప్ గెయినర్స్.
News February 18, 2025
మహిళలు, BC, SC, STలకు శుభవార్త

AP: సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకునే మహిళలు, BC, SC, ST, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు GOVT శుభవార్త చెప్పింది. వారి మూలధన పెట్టుబడిలో ప్లాంటు, యంత్రాలపై రాయితీని 35 నుంచి 45 శాతానికి పెంచింది. విద్యుత్ టారిఫ్లోనూ ప్రోత్సాహకాలు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. MSMEలు నెలకొల్పే SC, STలకు భూమి విలువలో 75% రాయితీ(గరిష్ఠంగా ₹25L) కల్పిస్తూ మరో GO ఇచ్చింది.