News August 5, 2024
బంగ్లా అల్లర్లు: పార్లమెంటులో మోదీ వద్దకు జైశంకర్

ప్రధాని నరేంద్ర మోదీని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పార్లమెంటులో అత్యవసరంగా కలిశారు. బంగ్లాదేశ్లో అల్లర్లు, షేక్ హసీనా రాజీనామా, సైనిక ప్రభుత్వ ఏర్పాట్ల గురించి ఆయనకు వివరించారని తెలిసింది. సరిహద్దుల్లో రెట్టింపు భద్రత, బలగాల మోహరింపు గురించీ మాట్లాడినట్టు సమాచారం. కేంద్రం రెండ్రోజుల కిందటే BSF చీఫ్ను మార్చిన సంగతి తెలిసిందే. రాహుల్ సైతం బంగ్లా వ్యవహారాలపై జైశంకర్తో మాట్లాడారని తెలిసింది.
Similar News
News April 16, 2026
పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పించండి: గోయెంకా

పిల్లలకు చిన్నతనం నుంచే పొదుపుపై అవగాహన కల్పించాలని పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సూచించారు. వారి ఆదాయాన్ని (పాకెట్ మనీ) మూడు భాగాలుగా విభజించాలని ఆయన పేర్కొన్నారు. ఒకటి పొదుపు/పెట్టుబడి కోసం, రెండోది వ్యక్తిగత వినోదం కోసం, మూడోది కుటుంబ ఉమ్మడి లక్ష్యాల కోసం ‘హోమ్ ట్యాక్స్’గా కేటాయించాలని తెలిపారు. ఈ విధానం వల్ల పిల్లల్లో బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
News April 15, 2026
మహిళా బిల్లుకే మా మద్దతు.. డీలిమిటేషన్కు లేదు: ఖర్గే

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అయితే డీలిమిటేషన్ బిల్లుకు తాము పూర్తి వ్యతిరేకమని అన్నారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం గారడీలు చేస్తోందని.. జనాభా లెక్కలపై ఎలాంటి క్లారిటీ లేదని పేర్కొన్నారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. ఇండీ కూటమి నేతల సమావేశం అనంతరం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
News April 15, 2026
పెద్ది సినిమా రిలీజ్ మరోసారి వాయిదా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 30వ తేదీ విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీ పలు కారణాలతో జూన్ నెలకు పోస్ట్పోన్ అయింది.


