News December 23, 2024

షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌ను కోరిన బంగ్లా

image

దేశంలో ఆశ్ర‌యం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హ‌సీనాను అప్ప‌గించాల‌ని భారత్‌ను బంగ్లా మ‌ధ్యంత‌ర ప్ర‌భుత్వం అధికారికంగా కోరింది. భార‌త్‌తో ఉన్న‌ ఖైదీల మార్పిడి ఒప్పందం మేర‌కు న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌క్రియ కోసం ఆమెను అప్ప‌గించాల్సిందిగా కోరిన‌ట్టు బంగ్లా దేశ విదేశాంగ స‌ల‌హాదారు తౌహిద్ హుస్సేన్ తెలిపారు. హ‌సీనా హ‌యాంలో చెల‌రేగిన అల్ల‌ర్ల‌లో జ‌రిగిన హ‌త్య కేసుల్లో ఆమెపై ఇప్ప‌టికే అభియోగాలు మోపారు.

Similar News

News January 13, 2025

49 ఏళ్ల నటితో డేటింగ్ వార్తలు.. సింగర్ స్పందన ఇదే

image

ప్రముఖ నటి అమీషా పటేల్(49) పలు బ్రేకప్‌ల తర్వాత ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారు. ఆమె ఇటీవల తనకంటే 20 ఏళ్ల చిన్నవాడైన సింగర్ నిర్వాన్ బిర్లాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ దుబాయ్‌లో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. ఆ రూమర్లను తాజాగా నిర్వాన్ ఖండించారు. ‘అమీషా మా ఫ్యామిలీ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి మా నాన్నకు ఆమె తెలుసు. మ్యూజిక్ ఆల్బమ్ కోసం మేం దుబాయ్ వెళ్లాం’ అని పేర్కొన్నారు.

News January 13, 2025

యువరాజ్ సింగ్ తండ్రిపై ఉమెన్స్ కమిషన్ సీరియస్

image

మహిళలను కించపరుస్తూ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ ఉమెన్స్ కమిషన్ ఆగ్రహించింది. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ ‘మహిళల చేతికి పవర్ ఇస్తే అంతా సర్వనాశనం చేస్తారు. గతంలో ఇందిరా గాంధీ దేశాన్ని పాలించి అదే చేశారు. ఏ మహిళకైనా ఇంటి బాధ్యతలు అప్పగిస్తే అంతే సంగతి. అందుకే వారికి పవర్ ఇవ్వొద్దు. ప్రేమ, గౌరవమే ఇవ్వాలి’ అని అన్నారు.

News January 13, 2025

నిజామాబాద్‌లో రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

image

TG: పండగ వేళ పసుపు రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి పల్లె గంగారెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. ఆయన మూడేళ్లపాటు పదవిలో ఉంటారని పేర్కొంది. కాగా తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గతంలో బీజేపీ హామీ ఇచ్చింది.