News August 10, 2024
ఉద్రిక్తత నడుమ బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా

బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఆయన న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన సమావేశం వివాదాస్పదమైంది. వీరంతా కుట్రలో భాగమని ఆరోపిస్తూ వందలాదిగా నిరసనకారులు సుప్రీం కోర్టును చుట్టుముట్టారు. గంటలోనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వెళ్లిపోయారని వార్తలు వచ్చినా చివరికి రాజీనామా చేయక తప్పలేదు. ఆయన హసీనాకు అనుచరుడని పేరుంది.
Similar News
News November 28, 2025
HYD: ‘సృష్టి’ కేసులో డా.నమ్రతకు బెయిల్ మంజూరు

సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేసులో సంచలన మలుపు తిరిగింది. సరోగసీ పేరుతో అక్రమాలు, నకిలీ పత్రాల సృష్టి, శిశువుల కొనుగోలు, విక్రయాల ఆరోపణల నడుమ ప్రధాన నిందితురాలు డా.నమ్రతకు బెయిల్ మంజూరు అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించింది. కాగా బెయిల్ మంజూరవ్వడంతో కేసులో కొత్త చర్చలకు దారితీసింది.
News November 28, 2025
బీసీ రిజర్వేషన్లు పెంపులో జగిత్యాల రెండో స్థానం

ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు పెరిగాయి. ఇందులో 1వ స్థానంలో హనుమకొండ ఉండగా.. 2వ స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది. 2019 ఎన్నికల్లో 25.07 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లు 2025లో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో 27.19 శాతానికి పెరిగి, గతంలో కంటే ప్రస్తుతం 2.12 శాతం బీసీ రిజర్వేషన్లు పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
News November 28, 2025
HYD: ‘సృష్టి’ కేసులో డా.నమ్రతకు బెయిల్ మంజూరు

సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేసులో సంచలన మలుపు తిరిగింది. సరోగసీ పేరుతో అక్రమాలు, నకిలీ పత్రాల సృష్టి, శిశువుల కొనుగోలు, విక్రయాల ఆరోపణల నడుమ ప్రధాన నిందితురాలు డా.నమ్రతకు బెయిల్ మంజూరు అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించింది. కాగా బెయిల్ మంజూరవ్వడంతో కేసులో కొత్త చర్చలకు దారితీసింది.


