News August 6, 2024

బంగ్లా మాజీ క్రికెటర్ మోర్తజా ఇంటిపై దాడి

image

బంగ్లాదేశ్‌ ప్రధాని, ఆవామీ పార్టీ అధినేత షేక్ హసీనా దేశం విడిచిపెట్టినప్పటికీ అక్కడి ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఆమె పార్టీ నేతలకు చెందిన ఇళ్లను, ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. తాజాగా బంగ్లా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మోర్తజా ఇంటిపై దాడి చేసి తగులబెట్టారు. మోర్తజా ఆవామీ పార్టీ తరఫున నరైల్-2 నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు. మరో క్రికెటర్ లిటన్ దాస్ ఇంటిపైనా దాడి జరిగినట్లు సమాచారం.

Similar News

News July 9, 2025

షాకింగ్.. పిల్లలకు లెక్కలు రావట్లేదు!

image

దేశంలోని స్కూళ్లలో విద్యార్థుల్లో ఎక్కువ మందికి లెక్కలు(గణితం) రావట్లేదని కేంద్రం సర్వేలో తేలింది. మూడో తరగతి పిల్లల్లో 45% మంది ఆరోహణ, అవరోహణ క్రమాన్ని గుర్తించలేకపోతున్నారని పేర్కొంది. ఆరో తరగతిలో 10 వరకు ఎక్కాలు(టేబుల్స్) వచ్చిన వారు 53% శాతమే. తొమ్మిదిలో గణితంపై అవగాహన ఉన్నవారు ఇంతే శాతమని తెలిపింది. దీని ప్రకారం విద్యార్థుల్లో ప్రతిభను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

News July 9, 2025

పవన్ కళ్యాణ్ ఓ డ్రామా ఆర్టిస్ట్: రోజా

image

AP Dy.CM పవన్ కళ్యాణ్ ఓ డ్రామా ఆర్టిస్ట్ అని YCP నేత రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో EVM ప్రభుత్వం నడుస్తోందని ఆమె మండిపడ్డారు. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఒక EVM CM. APలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా EVMను ఆరు నెలలు భద్రపరుస్తారు. కానీ APలో మాత్రం 10 రోజులకే నాశనం చేయాలంటూ జీవో జారీ చేస్తారు’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు.

News July 9, 2025

ప్రేయసి IPS అవ్వాలని ప్రియుడు ఏం చేశాడంటే?

image

ఢిల్లీకి చెందిన రాహుల్.. హరిద్వార్ నుంచి 121 లీటర్ల గంగాజలాన్ని కావడిలో మోసుకెళ్తూ రౌత్-ముజఫర్ నగర్ కావడి మార్గంలో కనిపించాడు. ఈ మార్గంలో శివ భక్తులు గంగా జలాన్ని తీసుకెళ్తుంటారు. అయితే, అందరిలా కాకుండా ఇతడు మాత్రం తన ప్రేయసి కోసం కావడి మోశారు. తాను ఇంటర్ పాసయ్యానని, ప్రేయసి IPS అయ్యేవరకూ ఇలా నీరు తెచ్చి దేవుడికి సమర్పిస్తూనే ఉంటానని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.