News April 2, 2024
హ్యాట్రిక్ వికెట్లు తీసిన బంగ్లాదేశ్ ప్లేయర్..

మహిళల క్రికెట్లో ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో బంగ్లాదేశ్ ప్లేయర్ ఫరీహా ఇస్లామ్ త్రిస్న హ్యాట్రిక్ సాధించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 4, 5, 6 బంతులకు వికెట్లు తీశారు. మొత్తంగా 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. కెరీర్లో ఆమెకు ఇది రెండో హ్యాట్రిక్ కావడం విశేషం. ఆసీస్ 161/8 స్కోర్ చేయగా, ఛేజింగ్లో బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు. 20 ఓవర్లలో 103/9 స్కోర్ చేసి జట్టు ఓడిపోయింది.
Similar News
News April 20, 2025
విమానాన్ని ఢీకొట్టిన టెంపో వ్యాన్!

బెంగళూరు ఎయిర్పోర్టులో నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ టెంపో వ్యాన్ ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం కింద వ్యాన్ ఇరుక్కున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై ఇండిగో స్పందించింది. ‘బెంగళూరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరుగుతోంది. అది పూర్తైన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
News April 20, 2025
వర్షం మొదలైంది..

TG: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, తుర్కపల్లి, శామీర్పేట, ఆలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడుతోంది. రాబోయే గంట నుంచి రెండు గంటల్లో HYDతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News April 20, 2025
మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరుగుతున్నాయి. అధిక వేడి కారణంగా కొందరు వడదెబ్బకు గురై అవస్థలు పడుతున్నారు. వడదెబ్బ తగిలిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకంటే ఎక్కువగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. వాంతులు, వికారంతోపాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరంలో మార్పులు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.