News August 17, 2024
26 కిలోల బంగారంతో బ్యాంకు మేనేజర్ పరార్

కేరళలో సుమారు 26 కిలోల బంగారంతో ఓ బ్యాంకు మేనేజర్ పరారయ్యారు. కోలీకోడ్ జిల్లా ఇడోడిలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ మధు జయకుమార్ ఇటీవల వేరే బ్యాంకుకు బదిలీ అయ్యారు. ఆయన బదిలీ తర్వాత చేపట్టిన సోషల్ ఆడిట్లో ఈ విషయం బయటపడింది. అధికార దుర్వినియోగంతో బ్యాంకు మేనేజర్ ఈ బంగారాన్ని విడతలవారీగా తస్కరించినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడి కోసం గాలిస్తున్నారు.
Similar News
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.
News December 10, 2025
ఉప్పల్లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.


