News August 17, 2024

26 కిలోల బంగారంతో బ్యాంకు మేనేజర్ పరార్

image

కేరళలో సుమారు 26 కిలోల బంగారంతో ఓ బ్యాంకు మేనేజర్ పరారయ్యారు. కోలీకోడ్ జిల్లా ఇడోడిలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ మధు జయకుమార్ ఇటీవల వేరే బ్యాంకుకు బదిలీ అయ్యారు. ఆయన బదిలీ తర్వాత చేపట్టిన సోషల్ ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. అధికార దుర్వినియోగంతో బ్యాంకు మేనేజర్ ఈ బంగారాన్ని విడతలవారీగా తస్కరించినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడి కోసం గాలిస్తున్నారు.

Similar News

News November 18, 2025

సతీశ్ మృతి కేసు.. కీలకంగా ఫోన్ డేటా!

image

AP: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసు దర్యాప్తులో ఆయన ఫోన్‌లోని సమాచారం కీలకంగా మారింది. ఫోన్ ధ్వంసమవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరైన సతీశ్ 13న అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆ రెండు తేదీల మధ్య ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

News November 18, 2025

సతీశ్ మృతి కేసు.. కీలకంగా ఫోన్ డేటా!

image

AP: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసు దర్యాప్తులో ఆయన ఫోన్‌లోని సమాచారం కీలకంగా మారింది. ఫోన్ ధ్వంసమవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరైన సతీశ్ 13న అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆ రెండు తేదీల మధ్య ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

News November 18, 2025

తిరుమల అప్డేట్స్

image

* టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 71,208 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు లభించింది.
* టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఇవాళ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. పది రోజుల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.