News August 6, 2024
మోసాలపై బ్యాంకుల పరిహారం రూ.140 కోట్లు

మోసపోయిన కస్టమర్లకు FY24లో ప్రభుత్వ బ్యాంకులిచ్చిన పరిహారం రూ.140 కోట్లని FM నిర్మల తెలిపారు. FY23లో ఈ విలువ రూ.42 కోట్లన్నారు. FY24లో UBI రూ.74.96 Cr, BOI రూ.20.38 Cr, IB రూ.16 Cr చెల్లించాయన్నారు. 2017 నాటి RBI రూల్స్ ప్రకారం బ్యాంకు నిర్లక్ష్యం, లోపం, వ్యవస్థ వల్ల జరిగే అనధీకృత లావాదేవీలకు కస్టమర్ జవాబుదారీ అవ్వరని చెప్పారు. ఒకవేళ నిర్లక్ష్యం కస్టమర్దే అయితే నష్టం భరించక తప్పదని వెల్లడించారు.
Similar News
News July 10, 2025
మోదీ, జగన్ మధ్య అక్రమ పొత్తు: YS షర్మిల

AP: మోదీకి జగన్ దత్తపుత్రుడు అని, వారి మధ్య అక్రమ పొత్తు ఉందని షర్మిల ఆరోపించారు. ‘మోదీ మద్దతుతో జగన్ ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. తలకాయల మీద కార్లు పోనిచ్చినా, మామిడి కాయలు తొక్కుకుంటూ వెళ్లినా, రప్పా రప్పా నరుకుతామని హెచ్చరించినా చీమంత చర్య కూడా ఉండదు’ అని ట్వీట్ చేశారు. జగన్ పర్యటనకు పైకి 500 మందితో అనుమతి ఇస్తారు కానీ 10వేల మందితో వచ్చినా కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని ఆమె విమర్శించారు.
News July 10, 2025
టాస్ ఓడిన భారత్.. జట్టులోకి బుమ్రా

లార్డ్స్ వేదికగా టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియాలో ప్రసిద్ధ్ స్థానంలో బుమ్రా జట్టులోకి వచ్చారు. IND(XI): జైస్వాల్, రాహుల్, నాయర్, గిల్, పంత్(Wk), జడేజా, సుందర్, ఆకాశ్ దీప్, సిరాజ్, బుమ్రా, నితీశ్. ENG(XI): క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్(Wk), వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్.
News July 10, 2025
గాల్లో ఢీకొన్న విమానాలు.. ఇద్దరి మృతి

కెనడాలో విమానాలు ఢీకొన్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు శిక్షణ విమానాలు గాల్లో ఢీకొనగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన శ్రీహరి సుకేశ్ (21)తో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. సుకేశ్ కేరళ వాసిగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సుకేశ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేసింది.