News April 3, 2025
లోకేశ్ సభలో బారికేడ్లు, పరదాలు.. వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు

AP: మంత్రి లోకేశ్ సభలో గ్రీన్మ్యాట్లు, బారికేడ్లు, పరదాలు ఉండటంపై YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ‘గ్రీన్ మ్యాట్లు వేస్తే గ్రాఫిక్స్ కోసం, పరదాలు కడితే అప్రజాస్వామ్యం, బారికేడ్లు పెడితే ప్రజలకు భయపడి, ఫొటోగ్రాఫర్స్ ఉంటే ప్రచార పిచ్చి.. ఇవి వైఎస్ జగన్ CMగా ఉన్నప్పుడు లోకేశ్ వాడిన పదజాలం. నేడు ఆయన కార్యక్రమానికి అవే పదాలు వర్తించవా?’ అని ప్రశ్నిస్తూ ఓ ఫొటోను షేర్ చేశారు.
Similar News
News July 5, 2025
ఒక టెస్టులో అత్యధిక పరుగులు వీరివే

* గ్రాహం గూచ్(ENG)- 456(333, 123)
* శుభ్మన్ గిల్(IND)-430(269, 161)
* మార్క్ టేలర్(AUS)-426(334, 92)
* సంగక్కర(SL)-424(319, 105)
* బ్రియన్ లారా(WI)-400(ఒకే ఇన్నింగ్సు)
* గ్రెగ్ చాపెల్(AUS)-380(247, 133)
* హేడెన్(AUS)-380(ఒకే ఇన్నింగ్సు)
* సందమ్(ENG)-375(325, 50)
News July 5, 2025
భారత్ డిక్లేర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 427/6 వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ గిల్ డిక్లేర్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ 607 పరుగుల ఆధిక్యంలో ఉంది. గిల్ (161), రాహుల్ (55), పంత్ (65) జడేజా (69*) రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. మరికాసేపట్లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది.
News July 5, 2025
DECLARE ఇవ్వరా? కెప్టెన్ మదిలో ఏముంది?

ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆధిక్యం 565 పరుగులు దాటింది. కానీ భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. రేపు ఒక రోజు మాత్రమే ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేట్గా డిక్లేర్ ఇస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉందని చర్చించుకుంటున్నారు. భారత్ మరీ ఆత్మరక్షణ ధోరణి కనబరుస్తోందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్?