News December 23, 2024
శ్రీవారి భక్తుల కోసం అలిపిరిలో బేస్ క్యాంప్: శ్యామలరావు
AP: శ్రీవారి భక్తులు సులభంగా సమాచారం తెలుసుకోవడానికి వీలుగా ‘చాట్ బాట్’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు TTD ఈవో శ్యామలరావు వెల్లడించారు. భక్తుల వసతి కోసం అలిపిరిలో 40 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటుచేస్తామన్నారు. రూ.70 లక్షల విలువైన పరికరాలతో టీటీడీ సొంతంగా ఏర్పాటుచేసుకున్న ల్యాబ్ జనవరి నుంచి అందుబాబులోకి వస్తుందని చెప్పారు. అన్నప్రసాదాలు,లడ్డూలు మరింత నాణ్యంగా అందిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 20, 2025
బన్నీ రికార్డును బ్రేక్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’!
విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. సంక్రాంతి బరిలో 6 రోజుల్లోనే రూ.180+ కోట్లు కలెక్ట్ చేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఈ రికార్డు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’పై(వారంలో రూ.180 కోట్లు) ఉండేది. వెంకీ చిత్రం కోసం ఫ్యామిలీలు క్యూ కడుతుండటంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి.
News January 20, 2025
త్వరలో వాట్సాప్లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
AP: జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను త్వరలో వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ సీఆర్ఎస్ అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. వాట్సాప్లో సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని మొదటగా తెనాలిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.
News January 20, 2025
JEE మెయిన్స్ రాస్తున్నారా? ఇవి తెలుసుకోండి!
జనవరి 22 నుంచి 30 వరకు JEE మెయిన్స్ జరగనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు అధికారుల సూచనలు:
– అడ్మిట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం తప్పనిసరి
– ఐడెంటిటీ కార్డు, అన్లైన్లో అప్లోడ్ చేసిన ఫొటో. బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్లాలి
– పెన్సిల్స్, నగలు, ఫోన్, వాటర్ బాటిల్, పర్సులకు నో ఎంట్రీ
– పరీక్ష సమయానికి 2 గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలి.
– ఉ.9-12 గం., మ.3-6 గం. మధ్య 2 షిప్టుల్లో జరగనుంది