News April 11, 2024
నరసరావుపేటలో సమవుజ్జీల సమరం

AP: రాజకీయ హేమాహేమీలు పోటీ చేసి గెలుపొందిన పార్లమెంట్ స్థానం పల్నాడు(D) నరసరావుపేట. ఈసారి ఇక్కడ సమవుజ్జీల పోటీ ఉత్కంఠ రేపుతోంది. నెల్లూరు సిటీ MLA అనిల్ కుమార్ యాదవ్ను YCP బరిలోకి దింపింది. గతంలోనూ నెల్లూరు జిల్లా నేతలు ఇక్కడ పోటీ చేసి నెగ్గిన చరిత్ర ఉంది. ఇటు TDP నుంచి లావు కృష్ణదేవరాయలు పోటీలో ఉన్నారు. విజయంపై ఇద్దరు నేతలూ ధీమాగా ఉండగా.. యాదవ వర్గం ఓట్లు కీలకంగా మారనున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 6, 2026
RCFLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (<
News January 6, 2026
మిరపలో ఈ సేద్య విధానం ఆదర్శం

మిరప సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు కొందరు రైతులు. సేంద్రియ కషాయాల వాడకంతో పాటు బంతి, ఆముదం మొక్కలను మిరపలో పెంచి చీడల ఉద్ధృతిని తగ్గిస్తున్నారు. పంటకు హాని చేసే పురుగుల తీవ్రతను తగ్గించడానికి జిగురు అట్టలు, సోలార్ ట్రాప్స్ వాడుతున్నారు. వీడ్ కంట్రోల్ మ్యాట్స్ వాడి కలుపును అరికడుతున్నారు. ఇలా రసాయనాలు లేకుండానే అధిక దిగుబడి సాధిస్తున్నారు.
News January 6, 2026
27 రైళ్లకు స్పెషల్ హాల్ట్లు

TG: సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే తగు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 7-20 వరకు మొత్తం 27 ఎక్స్ప్రెస్ రైళ్లకు స్పెషల్ హాల్ట్లు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి నడిచే 16 రైళ్లు హైటెక్ సిటీ స్టేషన్లో ఆగనున్నాయి. అలాగే సికింద్రాబాద్-విజయవాడ మార్గంలోని 11 రైళ్లకు చర్లపల్లి స్టేషన్లో హాల్ట్ ఏర్పాటు చేశారు. దీంతో IT ఉద్యోగులు, నగర ప్రయాణికులకు ఊరట లభించనుంది.


