News February 15, 2025
BCలకు 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పులతడకగా ఉందని BRS MLC కవిత ఆరోపించారు. ఖమ్మంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ‘బీసీలకు 42శాతం కాదు, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. కులగణన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టాలి. మతాలు, కులాల మధ్య గొడవలు పెట్టడమే బీజేపీ నేతల పని. జై భీమ్, జై బీసీ నినాదం ఒకచోటే ఉండాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News July 7, 2025
రూ.23 లక్షలతో దుబాయ్ గోల్డెన్ వీసా

భారత్, బంగ్లాదేశ్ ప్రజలు లక్ష ఏఈడీ (రూ.23.30 లక్షలు)లు చెల్లిస్తే దుబాయ్ గోల్డెన్ వీసా పొందొచ్చు. గతంలో రూ.4.66 కోట్లకుపైగా పెట్టుబడి పెడితే గోల్డెన్ వీసా మంజూరు చేసేది. ఇప్పుడు డైరెక్ట్గా డబ్బు చెల్లించి వీసా తీసుకోవచ్చు. ఈ వీసా పొందినవారు తమ ఫ్యామిలీతో దుబాయ్లో నివసించవచ్చు. డ్రైవర్లు, పనిమనుషులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా జాబ్, బిజినెస్ చేసుకునే ఛాన్స్ ఉంది. జీవితకాలం అక్కడే ఉండొచ్చు.
News July 7, 2025
గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టిన గిల్

ఇంగ్లండ్పై భారత్ సాధించిన విజయంలో ఎక్కువ క్రెడిట్ గిల్కే ఇవ్వాలి. బ్యాటుతోనే కాకుండా.. కెప్టెన్గానూ అద్భుతం చేశారు. విదేశాల్లో అతిపిన్న వయసులో టెస్టు మ్యాచ్ గెలిచిన కెప్టెన్గా గవాస్కర్(26Y 198D) పేరిట ఉన్న రికార్డును గిల్(25Y 297D) బద్దలు కొట్టారు. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, వారికి నచ్చిన ఫీల్డ్ సెట్ చేసి సూపర్ విక్టరీ సాధించారు. కచ్చితంగా డ్రా చేస్తామన్న ఇంగ్లండ్కు ఓటమి రుచి చూపించారు.
News July 7, 2025
జులై 7: చరిత్రలో ఈరోజు

1896: భారత్లో తొలిసారిగా బొంబాయిలో చలనచిత్ర ప్రదర్శన
1900: స్వాతంత్ర్య సమరయోధుడు కళా వెంకటరావు జననం
1915: సినీ నటుడు మిక్కిలినేని జననం
1929: పోప్ కోసం వాటికన్ సిటీ ఏర్పాటు
1930: ‘Sherlock Holmes’ రచయిత ఆర్థర్ కోనన్ మరణం
1959: రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు జననం
1973: గాయకుడు కైలాశ్ ఖేర్ జననం
1981: భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జననం
*ప్రపంచ చాక్లెట్ దినోత్సవం