News April 20, 2024

జాగ్రత్త.. మరో మూడురోజులు వడగాల్పులు

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీయనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రస్తుతం సాధారణం కంటే 4-6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు 55మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ఆదివారం 44మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది’ అని తెలిపారు. శుక్రవారం గరిష్ఠంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News March 26, 2026

డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ సర్వే పూర్తి: అశ్వినీ వైష్ణవ్

image

డోర్నకల్-గద్వాల మధ్య 296 km కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ లైన్ సూర్యాపేట, నల్గొండ మీదుగా సాగుతుంది. DPR తర్వాత దీనికి క్లియరెన్స్ లభిస్తుంది. అయితే జడ్చర్ల-నంద్యాల లైన్‌లో ట్రాఫిక్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో భూసేకరణ జాప్యం వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నా ఇప్పటివరకు 67% ల్యాండ్ సేకరించారు.

News March 26, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 26, 2026

MI, RCB మ్యాచ్ టికెట్ ధర ₹లక్ష!

image

దేశంలో IPL క్రేజ్ మామూలుగా లేదు. మ్యాచుల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇదే అదనుగా తమ వద్ద ఉన్న టికెట్లను థర్డ్ పార్టీ సైట్లు భారీ మొత్తానికి విక్రయిస్తున్నాయి. ‘ఈ నెల 29న జరిగే MI-KKR మ్యాచ్ టికెట్ ధరలు ₹6,500-50 వేలు ఉన్నాయి. APR 12న జరిగే MI-RCB టికెట్ రేట్లు ₹15,000-లక్ష పలుకుతున్నాయి’ అని Mid Day తెలిపింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. 28న SRH, RCB మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.