News February 16, 2025

వచ్చేవారం నుంచి జాగ్రత్త.. 38°Cకు ఉష్ణోగ్రతలు!

image

AP: రాష్ట్రంలో వచ్చేవారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారం ఉందని Andhra Pradesh Weatherman తెలిపారు. మంగళవారం(18th feb) నుంచి గుంటూరు-విజయవాడ, అనకాపల్లి-విజయనగరం, కర్నూలు-కడప బెల్ట్‌లో ఉష్ణోగ్రతలు 38°C వరకు నమోదవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళ పొగమంచు, చలి.. మధ్యాహ్నం నుంచి భానుడి ప్రతాపం కనిపిస్తోంది. ప్రజలు తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News December 5, 2025

యూరియాకు ఇవి ప్రత్యామ్నాయం

image

యూరియా కొరతను అధిగమించేలా ప్రస్తుతం మార్కెట్‌లో పంటపై పిచికారీ చేసే అనేక ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. నానో యూరియా, నానో DAP, నీటిలో కలిపి పిచికారీ చేసే 19:19:19, 20:20:20, కాంప్లెక్స్ ఎరువులు, అధిక సాంద్రత కలిగిన 13-0-45(HD), ద్రవరూప నత్రజని ఎరువు వంటివి అందుబాటులో ఉన్నాయి. దుక్కిలో సిఫారసుల మేరకు కాంప్లెక్స్ ఎరువులను వేసుకొని, పైరుపై పిచికారీ చేసే ఎరువులను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

News December 5, 2025

దీపం కొండెక్కితే..?

image

దీపం కొండెక్కిన తర్వాత ఉప్పును పారే జలంలో నిమజ్జనం చేయాలి. వత్తులను దాచిపెట్టుకోవాలి. ప్రమిదలను శుభ్రం చేసుకొని మళ్లీ వాడొచ్చు. నిమజ్జనం సాధ్యం కాకపోతే నీళ్లలో వేయాలి. శుక్రవారం దీపారాధన చేస్తే శనివారం ఈ పరిహారాలు పాటించాలి. ఆవుకు ఆహారం పెట్టి ప్రదక్షిణలు చేయాలి. ఈ ఉప్పు దీపాన్ని ఇంటికి ఈశాన్య దిశలో పెట్టాలి. ఇలా 11, 21 వారాలు చేస్తే శుభం కలుగుతుంది. దాచిపెట్టుకున్న వత్తులను ధూపంలో వాడుకోవచ్చు.

News December 5, 2025

124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL)లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ డిగ్రీ 65% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1050, SC,ST,PwBDలకు రూ.300 వెబ్‌సైట్: www.sail.co.in