News August 30, 2024
Be Careful: భారతీయుల్లో బయటపడ్డ సూక్ష్మపోషకాల లోపం

ఆరోగ్యానికి కీలకమైన సూక్ష్మపోషకాలను భారత ప్రజలు సరిపడా తీసుకోవడం లేదని లాన్సెట్ నివేదిక తెలిపింది. 185 దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది. 70% మంది అంటే 500 కోట్ల మంది తగినంత అయోడిన్, విటమిన్ E, కాల్షియం తీసుకోవడం లేదంది. భారత్లో స్త్రీలు అయోడిన్, పురుషులు జింక్, మెగ్నీషియం తక్కువగా తీసుకుంటున్నారని తెలిపింది. ప్రపంచ జనాభాలో 99.3% మంది తగు మోతాదుల్లో సూక్ష్మ పోషకాలు తీసుకోవడం లేదంది.
Similar News
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.