News July 10, 2024

బేర్ దెబ్బ.. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్

image

నిన్నటి సెషన్‌లో నూతన గరిష్ఠాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు డీలా పడ్డాయి. సెన్సెక్స్ 622 పాయింట్ల నష్టంతో 79,718 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 24,239 (-194) వద్ద కొనసాగుతోంది. పవర్, రియల్టీ, టెలికాం రంగాల్లో కొనుగోళ్లు నమోదైనా.. ఆటో, బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఆయిల్ & గ్యాస్ రంగాలు నష్టాలను నమోదు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. M&M షేర్లు 6%కుపైగా నష్టాలను నమోదు చేశాయి.

Similar News

News October 15, 2024

కోహ్లీ.. మరో 53 పరుగులు చేస్తే

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువయ్యారు. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టులో మరో 53 పరుగులు చేస్తే 9వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకోనున్నారు. దీంతో భారత జట్టు తరఫున టెస్టుల్లో 9వేల పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలవనున్నారు. ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు 115 టెస్టులు ఆడిన కోహ్లీ 8,947 పరుగులు చేశారు.

News October 15, 2024

KTRపై కేసు నమోదు

image

TG: మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. మూసీ ప్రాజెక్టును రూ.1.5 లక్షల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందని, అందులో రూ.25,000 కోట్లు ఢిల్లీకి పంపుతుందని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదుతో BNS 352, 353(2), 356(2) చట్టాల కింద KTRపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 15, 2024

కొండా సురేఖ ఫొటో మార్ఫింగ్.. ఇద్దరి అరెస్ట్

image

TG: మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు <<14234406>>ఫొటో మార్ఫింగ్ కేసులో<<>> ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సురేఖ, రఘునందన్ ఎడిటెడ్ ఫొటోలు వైరల్ కావడంతో జరిగిన పరిణామాలు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ ఫిర్యాదుతో నిజామాబాద్, జగిత్యాలకు చెందిన దేవన్న, మహేశ్‌లను అరెస్ట్ చేశారు.