News May 25, 2024
స్టాక్ మార్కెట్ మోసాలతో జాగ్రత్త! – 1/2

ఫేస్బుక్, వాట్సాప్లలో షేర్ మార్కెట్ టిప్స్ పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేటుగాళ్ల వలలో పడి బాధితులు రూ.కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల గుజరాత్కు చెందిన ఓ మాజీ సీఏను కేటుగాళ్లు స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తామని ‘Stock Vanguard 150’ అనే గ్రూప్లో చేర్పించారు. నకిలీ పోర్ట్ఫోలియోలో అతడి చేత రూ.1.97కోట్లు పెట్టుబడి పెట్టించి టోకరా వేశారు.
Similar News
News November 3, 2025
THDCలో 40 ఉద్యోగాలు

తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్(THDC) 40 అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి BSc, బీటెక్, BE, MBBS అర్హతగల అభ్యర్థులు NOV 7 నుంచి DEC 6వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.600. SC, ST, PWBDలకు ఫీజు లేదు. స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://thdc.co.in
News November 3, 2025
డిజిటల్ అరెస్టుల పేరిట ₹3వేల కోట్ల లూటీ

దేశంలో డిజిటల్ అరెస్టుల పేరిట ₹3వేల కోట్ల లూటీ జరిగిందని హోమ్ శాఖ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ స్కామ్ ఛాలెంజింగ్గా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరముందని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్, JM బాగ్చి అభిప్రాయపడ్డారు. దీనిపై త్వరలోనే ఆదేశాలిస్తామన్నారు. కాగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మోసాలపై విచారణ బాధ్యతను CBIకి అప్పగించాలని కోర్టు భావిస్తోంది.
News November 3, 2025
శివలింగానికి కుంకుమ పెడుతున్నారా..?

శివలింగానికి చాలామంది భక్తులు కుంకుమ పెడుతుంటారు. కానీ అలా పెట్టడం శాస్త్ర సమ్మతం కాదని పండితులు చెబుతున్నారు. శివలింగానికి విభూది, గంధం మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. ‘పరమశివుడు గాఢమైన ధ్యానంలో ఉంటారు. ఎరుపు రంగులో ఉండే కుంకుమ వేడిని పెంచుతుంది. అందుకే ఆయన శరీరానికి చల్లదనాన్ని, ప్రశాంతతను ఇచ్చే చందనాన్ని మాత్రమే సమర్పించాలి. శివారాధనలో కుంకుమకు బదులు గంధం వాడటం అత్యంత ముఖ్యం’ అంటున్నారు.


