News May 1, 2024

10 రోజులు భాగ్యనగర్ బంద్

image

TG: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ 10 రోజులు బంద్ కానుంది. నేటి నుంచి ఈ నెల 10 వరకు.. ఆ తర్వాత 16 నుంచి 22వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 3వ రైల్వే లైన్‌లో సాంకేతిక పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సూపర్‌ఫాస్ట్, రాజధాని రైళ్లకు లేని అడ్డంకులు.. సాధారణ, మధ్యతరగతి ప్రయాణించే భాగ్యనగర్‌కే ఎందుకని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News March 10, 2026

32,000 మంది అనర్హులకు PMKY నిధులు

image

PM కిసాన్ పథకం TGలో పక్కదారి పట్టింది. ఐటీ చెల్లింపుదారులు, భూమిని అమ్మేసిన వారు, ఇతర అనర్హులు ఇలా 32 వేలమంది లబ్ధి పొందినట్లు తేలింది. ఈ-కేవైసీలో ఆధార్ కార్డు లింక్ చేయడంతో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టిన వారు, అధిక భూమి ఉన్నవారు, కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికీ లబ్ధి కలిగినట్లు తేలింది. వీరికి PMKY నిలిపేశారు. పరిశీలన పూర్తయితే అనర్హులు ఇంకా తేలనున్నారు. ఈ స్కీములో ఏడాదికి ఎకరాకు ₹6వేలు ఇస్తున్నారు.

News March 10, 2026

ప్రభాస్ లేటెస్ట్ ఫొటో వైరల్

image

సినీ హీరో ప్రభాస్ లేటెస్ట్ ఫొటో SMలో వైరల్ అవుతోంది. ఆయనతో మలయాళం డైరెక్టర్ దిన్జిత్ అయ్యతాన్‌ దిగిన ఫొటో తాజాగా బయటికి వచ్చింది. ఇందులో ప్రభాస్ కొత్త హెయిర్ స్టైల్‌లో కనిపించారు. అటు ప్రభాస్‌తో మూవీ తీసేందుకు ఆసక్తి చూపుతున్న హోంబలే ఫిలిమ్స్ ఈ డైరెక్టర్ ద్వారా స్టోరీ వినిపించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన ఫౌజీ, కల్కి-2 మూవీల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

News March 10, 2026

భారత్‌లో టాప్ శాలరీ ₹8కోట్లు!

image

దేశంలో AI, సెమీకండక్టర్స్, EV, బ్యాటరీ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల ఉద్యోగులకు డిమాండ్ ఉందని ఇండియా శాలరీ గైడ్ 2026 వెల్లడించింది. స్కిల్‌ను బట్టి సంస్థలు 30% వరకు హైక్ ఇస్తున్నాయంది. టాప్ శాలరీల్లో ఫైనాన్స్ రంగం గరిష్ఠంగా ₹8Cr/yr ఆఫర్ చేస్తోంది. ప్రైవేట్ ఈక్విటీ, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లోనూ భారీ జీతాలు ఉన్నాయంది. CEO స్థాయి వారికి శాలరీతో పాటు బోనస్‌/షేర్లతో అదనపు ఆదాయం ఉంటుంది.