News February 9, 2025

రేపటి నుంచి ‘భాగ్యనగర్’ బంద్

image

TG:ఉత్తర తెలంగాణ వాసుల వరప్రదాయిని భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ 11 రోజుల పాటు నిలిచిపోనుంది. 3వ లైన్ పనుల కారణంతో సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య నడిచే ఈ రైలు రాకపోకలను ఈ నెల 10 నుంచి 21 వరకు నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, పొత్కపల్లి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ వరకు దీనిలో నిత్యం ప్రయాణించేవారుంటారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు తిప్పలు తప్పవు.

Similar News

News November 5, 2025

రేపే బిహార్ తొలిదశ పోలింగ్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారానికి నిన్నటితో తెరపడింది. 18 జిల్లాల పరిధిలోని 121 సెగ్మెంట్లలో రేపు పోలింగుకు ఈసీ ఏర్పాట్లన్నీ పూర్తిచేసింది. ఈ దశలో 8 మంది మంత్రులతోపాటు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు, JJL పార్టీ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా ఈ నెల 11న మరో 122 స్థానాల్లో పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది.

News November 5, 2025

చర్మ పీహెచ్‌ను కాపాడుతున్నారా?

image

ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల చర్మం దెబ్బతింటోంది. అందుకే దాని పీహెచ్‌ సరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. చర్మాన్ని రక్షిస్తూ ఎసిడిక్‌ ఫిల్మ్‌ ఉంటుంది. దాని pH 4.5- 5.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. లేదంటే మొటిమలు, దద్దుర్లు, పొడిబారడం, అతిగా నూనెలు విడుదలవ్వడం, ఎగ్జిమా వంటి సమస్యలు వస్తాయి. pH బ్యాలెన్స్‌డ్‌ ప్రొడక్ట్స్, సన్‌స్క్రీన్‌ వాడాలి. స్క్రబ్బింగ్ ఎక్కువగా చేయకూడదని సూచిస్తున్నారు.

News November 5, 2025

నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో ఉద్యోగాలు

image

విశాఖలోని నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో 18 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్, బాల్‌వాటిక టీచర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టోర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఈ నెల 25లోగా అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ncsvizagnsb.nesnavy.in/