News January 11, 2025

భాగ్యనగరం బోసి‘పోతోంది’!

image

పండగకు నగరవాసులందరూ ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తమ స్వగ్రామాలకు వెళ్లిపోతుండటంతో భాగ్యనగరం బోసిపోయింది. జనంతో కళకళలాడే రోడ్లు విదేశాల్లో రోడ్లలా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈరోజు, రేపు కూడా గడిస్తే పండుగకు వెళ్లేవారంతా వెళ్లిపోగా, హైదరాబాద్ రహదారులు మరింత నిర్మానుష్యంగా మారొచ్చని అంచనా. ప్రశాంతంగా ఉందని కొంతమంది అంటుంటే.. జనం లేక బోరింగ్‌గా కనిపిస్తోందని మరికొంతమంది పేర్కొంటున్నారు. మీ కామెంట్?

Similar News

News January 18, 2025

కెప్టెన్సీ రేసు నుంచి హార్దిక్ పాండ్య ఔట్!

image

రోహిత్ శర్మ తర్వాత వన్డే, టీ20 జట్లకు హార్దిక్ పాండ్యకే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ఒక దశలో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే తరచూ గాయాల పాలవుతుండటం, నిలకడలేమితో బీసీసీఐ అతడిని పరిగణనలోకి తీసుకోవట్లేదు. భవిష్యత్తులోనూ అతని కెప్టెన్సీ కల కల్లగానే మిగిలిపోనుందని విశ్లేషకుల అంచనా. టీ20లకు సూర్య(కెప్టెన్), అక్షర్‌(VC)కు అవకాశం ఇవ్వగా, వన్డేల్లో రోహిత్‌కు డిప్యూటీగా గిల్‌ను ప్రమోట్ చేస్తోంది.

News January 18, 2025

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

image

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు STT గ్లోబల్ డేటా సెంటర్ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆ సంస్థ రూ.3500 కోట్లతో మీర్‌ఖాన్‌పేట్‌లో ఆర్ట్ డేటా సెంటర్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుందని వెల్లడించారు. సింగపూర్‌ పర్యటన సందర్భంగా ఈ ఎంవోయూ చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఈ సంస్థకు హైటెక్ సిటీలో ఇప్పటికే ఓ ఆఫీస్ ఉంది.

News January 18, 2025

సైఫ్‌పై దాడి.. నిందితుడి అరెస్ట్!

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దుర్గ్ రైల్వే స్టేషన్‌లో RPF పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడికి బయల్దేరారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ముంబైకి తరలించనున్నారు. షాలీమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో అతడు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.