News June 25, 2024
భేష్ నితీశ్.. శుభాకాంక్షలు: వైఎస్ జగన్
AP: జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకోవడంపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అభినందనలు తెలిపారని ఆ పార్టీ పేర్కొంది. ‘జింబాబ్వే పర్యటనకు వెళ్తున్న భారత క్రికెట్ జట్టులో విశాఖకు చెందిన ఆల్రౌండర్ నితీశ్ చోటు సంపాదించడంపై జగన్ అభినందనలు తెలియజేశారు. ఈ టూర్లో మంచి ప్రతిభ చూపాలని, కెరీర్లో మరింత ఎదగాలని ఆకాంక్షించారు’ అని Xలో పోస్ట్ చేసింది.
Similar News
News October 10, 2024
రూ.10వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు..
రతన్జీ 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎప్పుడూ దేశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. బాధ్యతలు స్వీకరించిన సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.10వేల కోట్లుగా ఉంది. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో టాటా గ్రూపును విస్తరించారు. స్టీల్, ఆటో మొబైల్ వంటి రంగాల్లో విస్తృతపరిచారు. కంపెనీ బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూ చేపట్టిన సంస్కరణలతో పదవి నుంచి దిగిపోయే సరికి రెవెన్యూను రూ.లక్ష కోట్లకు చేర్చారు.
News October 10, 2024
సంక్షోభ సమయంలో నేనున్నాంటూ..
భారత్ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో హోటల్ ధ్వంసమైంది. అయినప్పటికీ రతన్ టాటా ముందుండి మరింత దృఢంగా పునర్నిర్మించారు. దాడిలో గాయపడ్డ బాధితులతో పాటు హోటల్ సిబ్బందికి అండగా నిలిచి భరోసానిచ్చారు. కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా రూ.1,500 కోట్ల భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు.
News October 10, 2024
ఈనెల 13 నుంచి రాష్ట్రపతి ఆఫ్రికా పర్యటన
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 13 నుంచి ఆఫ్రికాలోని అల్జీరియా, మౌరిటానియా, మలావిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేస్తారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. రాష్ట్రపతి పర్యటన భారత్-ఆఫ్రికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించింది. పర్యటనలో భాగంగా ముర్ము ఆఫ్రికాలోని ప్రవాస భారతీయులను కలవనున్నారు.