News December 13, 2024
39మందికి క్షమాభిక్ష ప్రకటించిన బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల తన కుమారుడికి క్షమాభిక్ష ప్రకటించి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో 39 మందికి క్షమాభిక్ష ప్రకటించారు. అలాగే, 1500 మంది ఖైదీలకు శిక్షాకాలం తగ్గించారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఒకరోజులో ఇంతమందికి క్షమాభిక్ష ప్రకటించడం ఇది తొలిసారి అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. బైడెన్ పదవీకాలం జనవరి 20తో ముగియనుంది.
Similar News
News January 16, 2026
BREAKING: ఫ్లిప్కార్ట్, మీషో, అమెజాన్కు షాక్

చట్టవిరుద్ధంగా వాకీ టాకీలను విక్రయిస్తున్నందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మెటా వంటి ఈకామర్స్ సంస్థలపై CCPA కఠిన చర్యలు తీసుకుంది. ఒక్కో సంస్థకు ₹10 లక్షల చొప్పున జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ దాటిన వైర్లెస్ పరికరాలకు లైసెన్స్, ఎక్విప్మెంట్ టైప్ అప్రూవల్ (ETA) తప్పనిసరి. ముందస్తు అనుమతులు లేదా లైసెన్సింగ్ సమాచారం లేకుండానే వీటిని విక్రయించినట్లు తేలింది.
News January 16, 2026
OTTలో కొత్త సినిమాలు.. చూసేయండి!

సంక్రాంతి సందర్భంగా కొన్ని కొత్త సినిమాలు OTTలోకి వచ్చాయి. శివాజీ, నవదీప్ నటించిన ‘దండోరా’, ఫర్హాన్ అక్తర్, రాశీఖన్నా ‘120 బహదూర్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, జగపతిబాబు, సుహాసిని తదితరులు నటించిన ‘అనంత’ మూవీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ZEE5లో గుర్రం పాపిరెడ్డి, సోనీలివ్లో మమ్ముట్టి ‘కలాంకావల్’ అందుబాటులో ఉన్నాయి. నెట్ఫ్లిక్స్లో వారం కిందట బాలయ్య ‘అఖండ-2’ విడుదలైంది.
News January 16, 2026
ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో BJP కూటమి

మహారాష్ట్రలో ముంబై, పుణే సహా 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. BMCలో ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఠాక్రే సోదరుల కూటమి మాత్రం వెనుకంజలో ఉంది. దాదాపు 50% పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి.


