News February 27, 2025

BIG ALERT: ఉ.11 తర్వాత బయటికి వెళ్లొద్దు

image

TGలో రానున్న 5 రోజులు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. MAR 2 వరకు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటికి వెళ్లొద్దని సూచించింది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని తెలిపారు. నిత్యం 5 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని చెప్పారు.

Similar News

News March 23, 2025

TODAY HEADLINES

image

* డీలిమిటేషన్‌పై HYDలో బహిరంగ సభ: రేవంత్
* కేంద్ర నిధులు రాబట్టండి.. అధికారులతో సీఎం చంద్రబాబు
* ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’: లోకేశ్
* రూ.2 లక్షలపైన ఉన్నవారికి రుణమాఫీ చేయం: తుమ్మల
* నేనెప్పుడూ కులం, మతం పాటించలేదు: పవన్
* డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి జగన్ లేఖ
* జైలు నుంచి పోసాని విడుదల
* టాలీవుడ్ దేశంలోనే బెస్ట్: మోహన్‌లాల్
* కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం

News March 23, 2025

₹లక్ష దాటిన వెండి ఇన్వెస్టర్లకు సూపర్ ఛాన్స్: జిమీత్

image

జీవితకాల గరిష్ఠానికి చేరిన వెండి ఇన్వెస్టర్లకు సదవకాశం కల్పిస్తోందని శామ్కో వెంచర్స్ CEO జిమీత్ మోదీ అన్నారు. గరిష్ఠాన్ని బ్రేక్ చేసిన ప్రతిసారీ మంచి రాబడిని అందించిందని వివరించారు. 3, 6, 12 నెలల వ్యవధిలో 61, 62, 83% స్ట్రైక్ రేటుతో వరుసగా సగటున 21, 31, 28% రాబడి ఇచ్చిందన్నారు. కొవిడ్ టైమ్ మినహాయిస్తే Silver to Gold రేషియో 30 ఏళ్ల కనిష్ఠమైన 1.09% వద్ద ఉండటం బుల్లిష్‌నెస్‌ను సూచిస్తోందన్నారు.

News March 23, 2025

నటుడి సూసైడ్ కేసు: CBI సంచలన నిర్ణయం!

image

యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌కు సంబంధించి 2 కేసులను CBI మూసేసినట్టు తెలిసింది. అతడి మరణం వెనుక కుట్ర జరిగిందనడానికి ఆధారాలేమీ దొరకలేదని ముంబై కోర్టుకు రిపోర్టులు సమర్పించినట్టు సమాచారం. రియా చక్రబర్తి సహా కొందరు ఆర్థికంగా, మానసికంగా వేధించడంతోనే SSR చనిపోయాడని అతడి తండ్రి కేకే సింగ్ 2020, ఆగస్టులో FIR నమోదు చేయించారు. కాగా SSR మాజీ మేనేజర్ దిశ మృతి కేసు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.

error: Content is protected !!