News October 5, 2024

శబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్

image

శబరిమల దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న భక్తులకే దర్శనం కల్పిస్తామని, అది కూడా రోజుకు 80వేల మందికే అనుమతి ఉంటుందని తెలిపింది. అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే మకరవిళక్కు సీజన్ మరో నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. శబరిమల వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.

Similar News

News December 19, 2025

మరికల్: ఆ పల్లెకు సర్పంచ్‌లుగా నాడు తల్లి.. నేడు తనయుడు

image

మరికల్ మండలం వెంకటాపూర్‌ గ్రామ పంచాయతీలో తల్లి వారసత్వాన్ని కుమారుడు నిలబెట్టుకున్నారు. 2019లో ఈ పంచాయతీ నూతనంగా ఏర్పడగా, తొలి సర్పంచ్‌గా కళావతమ్మ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఆమె తనయుడు విజయ్ కుమార్ రెడ్డి తన ప్రత్యర్థిపై 111 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. తల్లి హయాంలో జరిగిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

News December 19, 2025

రోజూ గుడ్లు పెట్టే కోళ్ల గురించి తెలుసా?

image

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయి. సంవత్సరానికి 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18 నుంచి 20 వారాల పాటు పెంచిన తర్వాత గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. గోధుమ రంగులో ఉండే ఈ గుడ్లు పెద్దగా ఉంటాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు.

News December 19, 2025

సర్పంచ్ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు!

image

TG: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఘటన జరిగింది. సర్పంచ్ బరిలో నిలిచిన ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ రాలేదు. వరంగల్(D) ఖానాపురం(M) కీర్యాతండాలో ఈ నెల 17న సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 239 ఓట్లు పోలవగా BJP బలపరిచిన బోడ గౌతమికి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. చివరికి నోటాకు ఒక ఓటు పోలైంది. దీంతో ఆమె తనకు తానూ ఓటు వేసుకోలేదా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ INC అభ్యర్థి విజయ గెలిచారు.