News October 5, 2024
శబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్

శబరిమల దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న భక్తులకే దర్శనం కల్పిస్తామని, అది కూడా రోజుకు 80వేల మందికే అనుమతి ఉంటుందని తెలిపింది. అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే మకరవిళక్కు సీజన్ మరో నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. శబరిమల వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
Similar News
News December 10, 2025
ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 10, 2025
వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.
News December 10, 2025
SKY..WHY?

IND టీ20 కెప్టెన్ సూర్య గత కొంతకాలంగా బ్యాటుతో రాణించలేకపోతున్నారు. ఒక్క ఫార్మాట్కే పరిమితమైన ఈ హిట్టర్ స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంపై విమర్శలొస్తున్నాయి. గత 19 ఇన్నింగ్స్లలో 13.47Avg, 119.35 స్ట్రైక్ రేటుతో 222 రన్స్ చేశారు. ఇందులో 11 ఇన్నింగ్స్లలో ఆయన స్కోర్ 10లోపే ఉంది. నిన్న SAతో తొలి T20లో 12 రన్స్ చేశారు. కెప్టెన్సీ వల్లే SKY బ్యాటింగ్లో ఫెయిలవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


