News December 22, 2024

రాష్ట్రంలో మళ్లీ భూకంపం

image

ఏపీలోని ప్రకాశం జిల్లాలో నిన్న భూప్రకంపనలు రాగా ఇవాళ మరోసారి భూమి కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ఒక సెకనుపాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. భయాందోళనకు గురైన వారంతా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. శనివారం కూడా దాదాపు ఇదే సమయంలో భూమి కంపించడం గమనార్హం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 18, 2025

ఇన్నేళ్లయినా 21వేల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ లేదు!

image

ఇండియాలో ఇంకా మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలున్నాయి. తాజాగా లద్దాక్‌లోని మారుమూల గ్రామాలైన మాన్ & మెరాక్‌లో ఎయిర్టెల్ తన సేవలను ప్రారంభించింది. దేశంలో 2024 సెప్టెంబర్ నాటికి దాదాపు 21వేల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒడిశాలో అత్యధికంగా 6వేల గ్రామాలు ఫోన్ వాడట్లేదు. కొండలు, లోయలు, దట్టమైన అడవుల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయలేకపోతున్నారు.

News November 18, 2025

ఇన్నేళ్లయినా 21వేల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ లేదు!

image

ఇండియాలో ఇంకా మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలున్నాయి. తాజాగా లద్దాక్‌లోని మారుమూల గ్రామాలైన మాన్ & మెరాక్‌లో ఎయిర్టెల్ తన సేవలను ప్రారంభించింది. దేశంలో 2024 సెప్టెంబర్ నాటికి దాదాపు 21వేల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒడిశాలో అత్యధికంగా 6వేల గ్రామాలు ఫోన్ వాడట్లేదు. కొండలు, లోయలు, దట్టమైన అడవుల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయలేకపోతున్నారు.

News November 18, 2025

చానెల్ CEO లీనా నాయర్ గురించి తెలుసా?

image

అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘Chanel’ గ్లోబల్‌ సీఈఓ లీనా నాయర్ భారతీయురాలని మీకు తెలుసా. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌‌లో పుట్టి పెరిగిన లీనా మేనేజ్‌మెంట్ డిగ్రీ చేశారు. 1992లో HULలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడ ఆమె దక్షతను మెచ్చి చానెల్ CEOగా ఎంపిక చేశారు. ఆమె అందించిన సేవలకు గానూ యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు.