News December 22, 2024

రాష్ట్రంలో మళ్లీ భూకంపం

image

ఏపీలోని ప్రకాశం జిల్లాలో నిన్న భూప్రకంపనలు రాగా ఇవాళ మరోసారి భూమి కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ఒక సెకనుపాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. భయాందోళనకు గురైన వారంతా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. శనివారం కూడా దాదాపు ఇదే సమయంలో భూమి కంపించడం గమనార్హం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 20, 2025

కాసేపట్లో ప్రమాణం.. చర్చిలో ట్రంప్ ప్రార్థనలు

image

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సందడి వాతావరణం నెలకొంది. కాసేపట్లో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్-మెలానియా దంపతులు సెయింట్ జాన్స్ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. వీరి వెంట వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్-ఉష దంపతులు కూడా ఉన్నారు. భారత కాలమానం ప్రకారం రా.10.30 గంటలకు ట్రంప్, వాన్స్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

News January 20, 2025

నూతన అధ్యక్షుడు తొలుత చేసే సంతకాలు ఇవే…!

image

అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ ఎన్నికల హామీలపై ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. మెక్సికోతో ఉన్న సరిహద్దును మూసివేయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపడం, ఆర్మీలో ట్రాన్స్‌జెండర్ల నియామకానికి అడ్డుకట్ట వేయడంతో పాటు పలు కీలక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.

News January 20, 2025

J&K ఎన్‌కౌంటర్: భారత జవాన్ వీరమరణం

image

J&Kలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ జవాన్ పంగల కార్తీక్ వీరమరణం పొందారు. నార్త్ కశ్మీర్‌లోని జలూరా సోపోరాలో ఇవాళ ఇస్లామిస్ట్ తీవ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో కార్తీక్ తీవ్రగాయాలపాలవడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరికొందరు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.