News June 4, 2024
లీడింగ్లో మేజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ
దేశంలో ఎన్డీఏ మేజిక్ ఫిగర్ దాటింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 290 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై మాత్రం కోయంబత్తూరులో వెనుకంజలో ఉన్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై కూడా చెన్నై వెస్ట్లో వెనుకంజలో కొనసాగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 222 సీట్లలో లీడింగ్లో కొనసాగుతోంది.
Similar News
News October 8, 2024
ఇరాన్ అణు పరీక్షలు జరిపిందా..?
తరచూ భూకంపాలు ఎదుర్కొనే ఇరాన్లో అక్టోబర్ 5న వచ్చిన భూప్రకంపనలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ వందల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణలు ప్రయోగించిన కొన్ని రోజుల తరువాత ఈ ప్రకంపనలు రావడంతో ఇరాన్ అణు పరీక్షలు జరిపిందనే ప్రచారం ఊపందుకుంది. సెమ్నాన్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం నమోదవ్వడంతో అణు పరీక్షలపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
News October 8, 2024
రేపు HYDకు సమంత.. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తారా?
మంత్రి కొండా సురేఖ ఆరోపణల తర్వాత తొలిసారి హీరోయిన్ సమంత రేపు హైదరాబాద్కు రానున్నారు. ఆలియా భట్ నటించిన ‘జిగ్రా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు ఆమె హాజరుకానున్నారు. దీంతో సమంత ఈ విషయంపై ఏమైనా మాట్లాడతారా? అనేదానిపై చర్చ మొదలైంది. మీడియా ఈ విషయంపై ప్రస్తావిస్తే ఆమె స్పందిస్తారా? లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. సమంతతో పాటు రానా, త్రివిక్రమ్ కూడా ఈవెంట్లో పాల్గొననున్నారు.
News October 8, 2024
మనుషులతో కాదు.. రోబోలతో శృంగారానికి ప్రాధాన్యత!
భవిష్యత్లో మహిళలు రోబోలతో ప్రేమలో పడతారని, శృంగారం విషయంలో పురుషుల కంటే వాటినే ఎక్కువగా ఇష్టపడతారని ఫ్యూచరాలజిస్ట్ డా.పియర్సన్ తెలిపారు. 2030నాటికి వర్చువల్ రియాలిటీ శృంగారం సర్వసాధారణమైపోతుందని, 2035 నాటికి శృంగార సంబంధిత పరికరాలు దీనితో లింక్ అవుతాయన్నారు. 2050 నాటికి రోబోట్ శృంగారం కామన్గా మారుతుందని అంచనా వేశారు. ఒకవేళ నిజమైన రిలేషన్షిప్స్ ఉంటే వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్నారు.