News August 3, 2024
మహా పరిణామాలు: షిండేతో శరద్ పవార్, రాజ్ ఠాక్రే చర్చలు

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. CM ఏక్నాథ్ షిండేను శరద్ పవార్, రాజ్ఠాక్రే (MNS) వేర్వేరుగా కలిశారు. రాజకీయంగా కీలకమైన మరాఠా రిజర్వేషన్లు, ఇంటి నిర్మాణ ప్రాజెక్టులపై వీరు చర్చించారు. LS ఎన్నికల్లో BJPకి మద్దతిచ్చిన ఠాక్రే చాలా సందర్భాల్లో షిండేను విమర్శిస్తున్నారు. ఇక MVA కూటమి నుంచి పవార్ ఒక్కరే షిండేను కలుస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ముందు వీరి చర్చలు ఆసక్తికరంగా మారాయి.
Similar News
News November 24, 2025
ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

TG: హైదరాబాద్ శామీర్పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.
News November 24, 2025
118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

<


