News February 6, 2025

భారత్‌కు బిగ్ షాక్.. ఓపెనర్లు ఔట్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (15), రోహిత్ శర్మ (2) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (1*), శ్రేయస్ అయ్యర్ (12*) ఉన్నారు. కాగా భారత్ విజయానికి ఇంకా 218 పరుగులు అవసరం.

Similar News

News March 25, 2025

స్వదేశీ MRI మెషీన్.. అక్టోబర్ నుంచి ట్రయల్స్

image

తొలి స్వదేశీ MRI మెషీన్‌ను భారత్ అభివృద్ధి చేసినట్లు ఎయిమ్స్ ఢిల్లీ తెలిపింది. అక్టోబర్ నుంచి ట్రయల్స్ కోసం ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో టెస్టుల ఖర్చులతో పాటు విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశముందని వెల్లడించింది. ఈ మెషీన్ వైద్య సాంకేతికతలో భారత్‌ను స్వావలంబన దిశగా నడిపించడంలో సహాయపడనుంది.

News March 25, 2025

నేలమట్టం కానున్న గబ్బా స్టేడియం

image

2021లో AUSపై గబ్బా స్టేడియం(బ్రిస్బేన్)లో టీమ్ఇండియా టెస్టు విజయం అపూర్వమైనది. 130ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేడియాన్ని 2032 ఒలింపిక్స్ తర్వాత కూల్చివేయనున్నట్లు క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం తెలిపింది. 1895లో నిర్మించిన ఈ స్టేడియం శిథిలావస్థకు చేరింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2032తర్వాత క్రికెట్ మ్యాచులన్నీ బ్రిస్బేన్‌ విక్టోరియా పార్క్ వద్ద నిర్మించనున్న స్టేడియంలో నిర్వహిస్తారు.

News March 25, 2025

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

image

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-CRRIలో 209 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం, ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900-63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500-81,000 జీతం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.500. ఏప్రిల్ 21 వరకు <>దరఖాస్తులకు<<>> అవకాశం ఉంది.

error: Content is protected !!