News March 28, 2024
బీఆర్ఎస్కు BIG SHOCK
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711644585806-normal-WIFI.webp)
BRSకు మరో షాక్ తగిలింది. వరంగల్ ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు BRS అభ్యర్థి కడియం కావ్య ప్రకటించారు. ఈమేరకు ఆమె పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. ‘కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం విషయాలు పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయి. నాయకుల మధ్య సమన్వయం లోపించింది. ఈ పరిస్థితుల్లో పోటీ చేయలేను’ అని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News February 5, 2025
దేశంలో నాన్వెజ్ బ్యాన్ చేయాలి: శత్రుఘ్న సిన్హా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738763661774_1032-normal-WIFI.webp)
దేశంలో మాంసాహారంపై నిషేధం విధించాలని సినీనటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. మన దేశంలో చాలా చోట్ల బీఫ్ బ్యాన్ చేశారని, అలానే నాన్వెజ్ను కూడా బ్యాన్ చేయాలన్నారు. నార్త్ఈస్ట్తోపాటు దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో గొడ్డు మాంసం విక్రయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తరాఖండ్ తీసుకొచ్చిన యూసీసీ (యూనిఫామ్ సివిల్ కోడ్) చట్టాన్ని ఆయన ప్రశంసించారు.
News February 5, 2025
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒప్పుకోని ‘AAP’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738764910818_782-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కొద్దిసేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఆప్ నేత సుశీల్ గుప్తా ఒప్పుకోలేదు. ‘ఇవి మాకు నాలుగో ఎన్నికలు. ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఆప్కు అధికారం వస్తుందని అంచనా వేయలేదు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పని చేశారు. ఫలితాలు మాకే అనుకూలంగా వస్తాయి. కచ్చితంగా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా అంచనా వేశాయి.
News February 5, 2025
కారు యజమానులకు GOOD NEWS!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738763765830_367-normal-WIFI.webp)
నేషనల్ హైవేలపై తరచూ ప్రయాణం చేసే ప్రైవేట్ కారు యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వీరి కోసం ఏడాదికి రూ.3000, 15 ఏళ్లకు రూ.30000తో పాసులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. వీటితో దేశంలోని ఏ జాతీయ రహదారిపైనైనా ఎన్నిసార్లైనా తిరగొచ్చు. ప్రస్తుతం నెలకు రూ.340 పాసుతో ఒక టోల్ ప్లాజాలోనే వెళ్లాలనే రూల్ ఉంది. కొత్త విధానం ప్రకారం నెలకు రూ.250 చెల్లిస్తే చాలు.