News March 28, 2024
బీఆర్ఎస్కు BIG SHOCK

BRSకు మరో షాక్ తగిలింది. వరంగల్ ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు BRS అభ్యర్థి కడియం కావ్య ప్రకటించారు. ఈమేరకు ఆమె పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. ‘కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం విషయాలు పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయి. నాయకుల మధ్య సమన్వయం లోపించింది. ఈ పరిస్థితుల్లో పోటీ చేయలేను’ అని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News February 12, 2026
మూల్యాంకనంలో తప్పులు జరగకుండా CBSE కీలక నిర్ణయం

12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం CBSE మళ్లీ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) పద్ధతిని ప్రారంభించాలని నిర్ణయించింది. స్కాన్ చేసిన జవాబు పత్రాలను ఉపాధ్యాయులు కంప్యూటర్లలోనే దిద్ది, మార్కులు వేస్తారు. సాఫ్ట్వేర్ ద్వారా మార్కులు ఆటోమేటిక్గా లెక్కించడంతో కూడికలో తప్పులు జరగవని బోర్డు భావిస్తోంది. ఫలితాలు చాలా వేగంగా, పారదర్శకంగా విడుదల చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
News February 12, 2026
రహేజాకు భూములపై మండలిలో వాడీవేడి చర్చ

AP: కంపెనీలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడీవేడి చర్చ సాగింది. రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన రహేజాకు 99 పైసలకే భూములు ఎలా ఇస్తారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స, YCP MLC మాధవరావు ప్రశ్నించారు. విశాఖలోని భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. రహేజా బిల్డింగ్స్లో అనేక కంపెనీలు వస్తున్నాయని, వేలాది ఉద్యోగాల కల్పన జరుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు.
News February 12, 2026
ఢిల్లీ బాంబు పేలుడుకు జైషేతో లింకులు: UN

ఢిల్లీ <<18265346>>బాంబు బ్లాస్ట్<<>>కు పాక్కు చెందిన ఉగ్రసంస్థ జైషే మహ్మద్(JeM)తో సంబంధం ఉందని UN ఉగ్రవాద నిరోధక పర్యవేక్షణ బృందం పేర్కొంది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఈ సంస్థ ప్రత్యేకంగా మహిళా వింగ్ను ఏర్పాటు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. JeMతో ప్రమాదమని పలు దేశాలు చెబుతుంటే ఓ సభ్య దేశం మాత్రం ఆ సంస్థ పని చేయడంలేదని అంటోందని విమర్శించింది. UNSCకి సమర్పించిన నివేదికలో <<16299135>>పహల్గామ్<<>> దాడినీ ప్రస్తావించింది.


