News January 9, 2025

ఇందిరమ్మ ఇళ్లపై BIG UPDATE

image

TG: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రీవెన్స్ మాడ్యూల్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో ప్రారంభించారు. ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే <>indirammaindlu.telangana.gov.in<<>>కు ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్రామాల్లో MPDO, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా అధికారులకు ఫిర్యాదులు వెళ్తాయన్నారు. మొదట నివాస స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మిస్తామని, 2వ దశలో స్థలంతో పాటు ఇళ్లు నిర్మిస్తామన్నారు.

Similar News

News January 16, 2025

సైఫ్‌ను రూ.కోటి డిమాండ్ చేసిన దుండగుడు!

image

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్‌ను రూ.కోటి డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి ఒప్పుకోకపోవడంతో అగంతకుడు దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

News January 16, 2025

ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చిన కేటీఆర్

image

TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ ఆఫీస్‌ నుంచి బయటికొచ్చారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అటు సుమారు 7 గంటలపాటు కేటీఆర్‌ను అధికారులు విచారించారు. HMDA ఖాతా నుంచి విదేశీ సంస్థకు రూ.45 కోట్లు చెల్లించడంపై ప్రధానంగా ప్రశ్నలు సంధించారు.

News January 16, 2025

600 బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 600 ప్రొబెషనరీ ఆఫీసర్స్(PO) దరఖాస్తుల గడువు ఈనెల 19కి పొడిగించింది. అభ్యర్థులు ఇక్కడ <>క్లిక్<<>> చేసి అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.750 కాగా SC, ST, PwD క్యాండిడేట్లకు ఉచితం. డిగ్రీ పూర్తి చేసి, 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు.