News November 25, 2024

బిహార్ విఫల రాష్ట్రం.. చెత్తలో కూరుకుపోయింది: ప్రశాంత్ కిశోర్

image

బిహార్‌లో 4 స్థానాలకు జరిగిన బైఎలక్షన్‌లో ఘోర ఓటమి తర్వాత జన సురాజ్ లీడర్ ప్రశాంత్ కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. USలోని బిహారీలతో వర్చువల్‌గా మాట్లాడుతూ ‘బిహార్ ఒక విఫల రాష్ట్రం. అది చెత్తలో కూరుకుపోయింది. సుడాన్‌లో 20ఏళ్లుగా సివిల్ వార్ జరుగుతోంది. అక్కడ ప్రజలు పిల్లల చదువుల గురించి పట్టించుకోరు. అలాంటి పరిస్థితే ఇక్కడా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి’ అని చెప్పారు.

Similar News

News December 30, 2025

అందరికీ AI: ప్రభుత్వం సరికొత్త ప్లాన్!

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం కొందరికే పరిమితం కాకుండా, సామాన్యులకూ అందుబాటులోకి రావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ‘AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’పై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నగరాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోని వారూ లోకల్ భాషల్లో AI టూల్స్ తయారు చేసుకునేలా.. కంప్యూటింగ్ పవర్, డేటాను అందరికీ షేర్ చేయడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.

News December 30, 2025

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నేడు ఏం దానం చేయాలంటే?

image

వైకుంఠ ఏకాదశి పర్వదినాన దానాలు చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ‘దుప్పట్లు, వస్త్రాలు దానం చేయడం శ్రేష్ఠం. స్తోమత ఉంటే గోదానం చేయవచ్చు. ఇది ఎంతో పుణ్యాన్నిస్తుంది. సమాజంలో గౌరవం, ఆర్థికాభివృద్ధిని తెస్తుంది. అన్నదానం, అవసరమైన వారికి ఆర్థిక సాయం చేస్తే పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పవిత్ర రోజున స్వార్థం వీడాలని, చేసే చిన్న దానలైనా తృప్తిగా చేయాలని పండితులు చెబుతున్నారు.

News December 30, 2025

మాజీ ఎమ్మెల్యే మృతి

image

AP: రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ గుండెపోటుతో ఇవాళ మృతి చెందారు. అనారోగ్యంతో ఇటీవల తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు వెల్లడించారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన ప్రసాద్.. 2004లో అదే పార్టీ నుంచి గెలుపొందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.