News November 25, 2024
బిహార్ విఫల రాష్ట్రం.. చెత్తలో కూరుకుపోయింది: ప్రశాంత్ కిశోర్

బిహార్లో 4 స్థానాలకు జరిగిన బైఎలక్షన్లో ఘోర ఓటమి తర్వాత జన సురాజ్ లీడర్ ప్రశాంత్ కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. USలోని బిహారీలతో వర్చువల్గా మాట్లాడుతూ ‘బిహార్ ఒక విఫల రాష్ట్రం. అది చెత్తలో కూరుకుపోయింది. సుడాన్లో 20ఏళ్లుగా సివిల్ వార్ జరుగుతోంది. అక్కడ ప్రజలు పిల్లల చదువుల గురించి పట్టించుకోరు. అలాంటి పరిస్థితే ఇక్కడా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి’ అని చెప్పారు.
Similar News
News December 15, 2025
మోదీ, మెస్సీ మీటింగ్ క్యాన్సిల్!

ఢిల్లీలో తీవ్ర పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో మెస్సీ టూర్ ఆలస్యమైంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం 2గంటలకు విమానం ల్యాండ్ అయింది. అక్కడి నుంచి హోటల్లో గ్రీట్ అండ్ మీట్లో పాల్గొని 4PMకు జైట్లీ స్టేడియానికి చేరుకుంటారు. సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్తో సహా కోట్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా ఫ్లైట్ ఆలస్యం కారణంగా మోదీతో భేటీ క్యాన్సిల్ అయింది.
News December 15, 2025
భారీ జీతంతో మేనేజర్ పోస్టులు

<
News December 15, 2025
రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్

లక్నోలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రీతు కరిధాల్ 1997లో ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజినీర్గా చేరారు. ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులైన మార్స్ ఆర్బిటార్ మిషన్, మంగళ్యాన్ ప్రయోగాలకు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా పనిచేశారు. 2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2కి మిషన్ డైరెక్టర్గా రీతూ బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు.


