News September 13, 2024

బిన్ లాడెన్ కొడుకు బతికే ఉన్నాడు: ఇంటర్నేషనల్ మీడియా

image

ఒసామా బిన్‌లాడెన్ కొడుకు హంజా బిన్‌లాడెన్ బతికే ఉన్నాడని ‘ది మిర్రర్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఒసామాను 2011లో US దళాలు హతమార్చగా, 2019 వైమానిక దాడిలో హంజా మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అతను 450 మంది స్నైపర్స్ రక్షణలో అఫ్గాన్‌లో ఉన్నాడని, రహస్యంగా అల్ ఖైదా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని తెలిపింది. తాలిబన్లు అధికారం చేపట్టాక ఉగ్రసంస్థలకు శిక్షణ కేంద్రంగా కాబుల్ మారిందని పేర్కొంది.

Similar News

News November 22, 2025

కర్నూలు: సీఐ జీపు ఎత్తుకెళ్లిన మందుబాబు!

image

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో వింత ఘటన జరిగింది. పెద్దహోతూరుకు చెందిన యువరాజు మద్యం మత్తులో సీఐ రవిశంకర్ జీపును ఎత్తుకెళ్లాడు. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా యువరాజు డ్రంకన్ డ్రైవ్‌లో బైక్‌తో పట్టుబడ్డారు. తన బైక్ ఇవ్వనందుకు పోలీసులను మరిపించి సీఐ జీపును తన గ్రామానికి తీసుకెళ్లాడు. ఇది గమనించిన యువరాజు సోదరుడు అంజి వెంటనే జీపును తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేర్చారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News November 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 74

image

ఈరోజు ప్రశ్న: వేంకటేశ్వరస్వామి ద్వార పలుకులు అయిన జయవిజయులు తర్వాతి మూడు జన్మలలో అసురులుగా ఎందుకు జన్మించారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 22, 2025

26న ‘స్టూడెంట్ అసెంబ్లీ’.. వీక్షించనున్న సీఎం

image

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న అసెంబ్లీ ఆవరణలో ‘స్టూడెంట్ అసెంబ్లీ’ నిర్వహించనున్నారు. ఇందుకోసం 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. కొందరు స్పీకర్, Dy.స్పీకర్, CM, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తారు. మిగతా విద్యార్థులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తారు. రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని CM CBN, మంత్రులు వీక్షించనున్నారు.