News August 21, 2024
రైల్వే ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్

ఓవర్ టైం సదుపాయం వినియోగంలో ఉద్యోగులు, సిబ్బంది అవకతవకలను అరికట్టడంపై రైల్వే బోర్డు ఫోకస్ పెట్టింది. అన్ని రైల్వే స్టేషన్లలో సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు యంత్రాలు లేదా ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని 17 రైల్వే జోన్ల GMలను ఆదేశించింది. రైల్వే విజిలెన్స్ డైరెక్టరేట్ చేసిన సిఫార్సుల మేరకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News October 14, 2025
బాహుబలిని బీట్ చేసిన కాంతార ఛాప్టర్-1

కాంతార ఛాప్టర్-1 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్గా రూ.675Cr వసూలు చేసి బాహుబలి-ది బిగినింగ్(రూ.650Cr)ను బీట్ చేసింది. ఇదేక్రమంలో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’(రూ.628Cr) రికార్డు కూడా బద్దలైంది. దీంతో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-20 చిత్రాల్లో 17వ స్థానానికి ఎగబాకింది. అటు 2025లో హయ్యెస్ట్ గ్రాస్ పొందిన సినిమాల్లో రెండో ప్లేస్ దక్కించుకుంది. ఫస్ట్ ప్లేస్లో ఛావ(రూ.808Cr) ఉంది.
News October 14, 2025
BREAKING: గూగుల్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ప్రతిష్ఠాత్మక టెక్ కంపెనీ గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలపై అగ్రిమెంట్ కుదిరింది. CM చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.88,628 కోట్లతో ఒక గిగావాట్ కెపాసిటీతో 2029 నాటికి విశాఖలో డేటా సెంటర్ పూర్తికి గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
News October 14, 2025
రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు: మంత్రి లోకేశ్

AP: విశాఖలో గూగుల్ అడుగుపెట్టడం సంతోషంగా ఉందని, ఇది రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు అని మంత్రి లోకేశ్ అభివర్ణించారు. ఇది గ్లోబల్ టెక్ మ్యాప్పై APని బలంగా నిలబెట్టే మైలురాయి అవుతుందన్నారు. ఢిల్లీలో గూగుల్తో ఒప్పంద కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్రం సహకారం, విజనరీ లీడర్ CBN నాయకత్వంలో రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని చెప్పారు. డిజిటల్ హబ్గా దేశానికి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.