News August 29, 2024
BJP, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి: హరీశ్రావు

TG: కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణంపై సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడంలేదని BRS MLA హరీశ్రావు ప్రశ్నించారు. BJP, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, అందుకే ఈ వ్యవహారంలో ఈడీ దాడులు జరగట్లేదని ఆరోపించారు. BJPకి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో విచారణ జరిపించాలి. సివిల్ సప్లైస్ కుంభకోణంపైనా ఈడీ విచారణ చేయాలని మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News January 24, 2026
Republic day Special: అరుణా అసఫ్ అలీ

అరుణా అసఫ్ అలీ గొప్ప దేశభక్తురాలు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో జైలు శిక్ష అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించడంతో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 1942లో అజ్ఞాతంలో ఉంటూనే ఉద్యమాన్ని కొనసాగించారు. 1997లో మరణాంతరం ప్రభుత్వం ఆమెకు ‘భారతరత్న’ ప్రదానం చేసింది.
News January 24, 2026
ఢిల్లీ.. ఊపిరి పీల్చుకో!

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఇవాళ కాస్త స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. వర్షాలు, గాలి వేగం పెరగడంతో వాయు కాలుష్యం తగ్గి గాలి నాణ్యత కొద్దిగా మెరుగైంది. సగటున AQI 249 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ క్షీణించడంతో కొన్ని నెలలుగా అక్కడి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలతో పాటు మంచు కురుస్తోంది.
News January 24, 2026
ఉగ్ర కుట్ర భగ్నం.. 2.5 కిలోల RDX స్వాధీనం!

రిపబ్లిక్ డే లక్ష్యంగా ఉగ్రదాడి కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. హొషియార్పూర్లో నలుగురు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) టెర్రరిస్టులను అరెస్టు చేశారు. 2.5 కిలోల RDX, 2 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అమెరికాకు చెందిన హ్యాండ్లర్ల ద్వారా ఈ ముఠా ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. గణతంత్ర వేడుకల్లో దాడులకు ప్లాన్ చేశారన్న సమాచారంతో సోదాలు చేసినట్లు చెప్పారు.


