News May 25, 2024
ఎన్నికల కోసం పీవోకేపై బీజేపీ డ్రామా: శశిథరూర్

పాక్ ఆక్రమిత కశ్మీర్పై పదేళ్లలో BJP ఏం చేసిందని కాంగ్రెస్ MP శశిథరూర్ ప్రశ్నించారు. ఎన్నికల కోసం పీవోకేపై బీజేపీ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యల్ని మోదీ విస్మరిస్తున్నారని అన్నారు. ఓట్ల కోసం భావోద్వేగపరమైన విషయాలను లేవనెత్తడం సరికాదని విమర్శించారు.
Similar News
News November 7, 2025
NEEPCOలో 98 పోస్టులకు అప్లై చేశారా?

NTPC అనుబంధ సంస్థ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News November 7, 2025
వారికి టోల్ ఫీజు వద్దు.. కేంద్రానికి లేఖ

AP: స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, MROలు, RDOలకు నేషనల్ హైవేలపై టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు లేఖ రాసింది. అధికారిక కార్యక్రమాల కోసం ప్రయాణించే అధికారుల ID చూపిస్తే టోల్ లేకుండానే పంపించాలని విజ్ఞప్తి చేసింది. ప్రకృతి విపత్తులు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల కోసం వీరు ఎక్కువగా NHలపై ప్రయాణిస్తుంటారని పేర్కొంది.
News November 7, 2025
‘ఎత్తు’లోనూ దూసుకుపోతున్న చైనా!

టెక్నాలజీతో పాటు చైనీయులు తమ ఎత్తును పెంచుకోవడంలోనూ దూసుకెళ్తున్నారు. గత 35 ఏళ్లలో చైనా పురుషులు సగటున 9 సెం.మీలు పెరగగా, భారతీయులు 2 సెం.మీ. మాత్రమే పెరగడం ఆందోళనకరం. పోషకాహార లోపం, నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వంటి కారణాలతో దాదాపు 35% మంది భారతీయ చిన్నారులు కురచబడినవారుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరుగుదల అనేది సామాజిక-ఆర్థిక పురోగతికి సూచికగా పనిచేస్తుందని తెలియజేశారు.


