News May 25, 2024
ఎన్నికల కోసం పీవోకేపై బీజేపీ డ్రామా: శశిథరూర్

పాక్ ఆక్రమిత కశ్మీర్పై పదేళ్లలో BJP ఏం చేసిందని కాంగ్రెస్ MP శశిథరూర్ ప్రశ్నించారు. ఎన్నికల కోసం పీవోకేపై బీజేపీ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యల్ని మోదీ విస్మరిస్తున్నారని అన్నారు. ఓట్ల కోసం భావోద్వేగపరమైన విషయాలను లేవనెత్తడం సరికాదని విమర్శించారు.
Similar News
News February 16, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మనదే హవా

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు టీమ్ ఇండియాపైనే ఉంది. మన జట్టు ఇప్పటివరకు 18 విజయాలు తన ఖాతాలో జమ చేసుకుంది. ట్రోఫీ చరిత్రలోనే భారత్ నిలకడైన జట్టుగా కొనసాగుతోంది. ఆ తర్వాత శ్రీలంక (14), ఇంగ్లండ్ (14), వెస్టిండీస్ (13), ఆస్ట్రేలియా (12), న్యూజిలాండ్ (12), సౌతాఫ్రికా (12), పాకిస్థాన్ (12) ఉన్నాయి.
News February 16, 2025
ఏప్రిల్లో మత్స్యకారులకు రూ.20,000: మంత్రి

AP: ఏటా JANలో జాబ్ క్యాలెండర్, మెగా DSC అంటూ జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. MLC ఎన్నికలు ముగియగానే తమ ప్రభుత్వం 16,247 పోస్టులతో DSC విడుదల చేస్తుందని పునరుద్ఘాటించారు. జూన్కు ముందే నియామకాలు పూర్తి చేస్తామని, ‘తల్లికి వందనం’ అందిస్తామని చెప్పారు. సముద్రంలో చేపల వేట నిషేధిత రోజులకు గాను మత్స్యకారులకు APRలో ₹20K, MAYలో ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేస్తామన్నారు.
News February 16, 2025
మస్తాన్ సాయి కేసు.. గవర్నర్కు లావణ్య లాయర్ లేఖ

AP: <<15471142>>మస్తాన్సాయి<<>> కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబాన్ని తొలగించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు లావణ్య తరఫు లాయర్ లేఖ రాశారు. అతని నేరాల వల్ల దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అలాగే సీఎస్, గుంటూరు కలెక్టర్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శికి కూడా లేఖలు రాశారు.