News February 9, 2025
సా.5 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు సాయంత్రం 5 గంటలకు కీలక సమావేశం కానున్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీకి ఆ పార్టీ ముఖ్య నేతలు బీఎల్ సంతోష్, బైజయంత్ పాండా హాజరుకానున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు వారు దిశానిర్దేశం చేయనున్నారు. అటు సీఎం అభ్యర్థిపైనా చర్చించే అవకాశం ఉంది.
Similar News
News April 10, 2026
ఇండియన్ రైల్వేలో అతిపెద్ద కనెక్టింగ్ పాయింట్!

UPలోని ‘మథుర జంక్షన్’ IND రైల్వేలో అత్యంత కీలకమైన కేంద్రమనే విషయం మీకు తెలుసా? ఇక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చే 7 ప్రధాన రైలు మార్గాలు ఒకేచోట కలుస్తాయి. అందుకే రోజూ దాదాపు 190రైళ్లు ఇక్కడ ఆగుతుంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, ముంబై నుంచి కోల్కతా వరకు దేశాన్ని ఏకం చేసే అతిపెద్ద జంక్షన్ ఇదే. ఆధ్యాత్మికంగా కృష్ణ జన్మభూమి కావడంతో పాటు, భౌగోళికంగా ఇది దేశాన్ని కలిపే ‘కనెక్టింగ్ పాయింట్’గా నిలుస్తోంది.
News April 10, 2026
HDFC వినియోగదారులకు అలర్ట్!

సిస్టమ్ అప్గ్రేడ్ వల్ల రేపు 2.30AM నుంచి 6.30AMవరకు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు HDFC ప్రకటించింది. అయితే ఉదయం 5 తర్వాత UPI లావాదేవీలు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొంది. డెబిట్ కార్డుల ద్వారా రూ.5వేల వరకూ నగదు విత్డ్రాలు, ఆన్లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. Zapp వాలెట్ సేవలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతాయని తెలియజేస్తూ వినియోగదారులను అలర్ట్ చేసింది.
News April 10, 2026
ముద్దు ముచ్చట తీరకముందే బకెట్ తన్నేస్తారా?

పెళ్లి, పిల్లల ముద్దుముచ్చట్లు, రిటైర్మెంట్ లైఫ్.. ఇవన్నీ అనుభవించాల్సిన జీవితాన్ని నేటి యువత చేజేతులా నాశనం చేసుకుంటోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘గంటల తరబడి కూర్చొని పని చేయడం, జంక్ ఫుడ్, ఒత్తిడి తగ్గాలని స్మోకింగ్, నిద్ర కోసం మద్యం సేవించడం ప్రాణాంతకం. సంపూర్ణమైన జీవితం గడపాలంటే తక్షణమే జీవనశైలి మార్చుకోండి. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి’ అని డాక్టర్లు సూచిస్తున్నారు.


