News April 24, 2024
బీజేపీ టార్గెట్ 400 కాదు.. 399

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ మారింది. ఇప్పటి వరకు ‘అబ్ కీ బార్ 400 పార్’ అన్న నినాదంతో ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారు. నిన్న గుజరాత్లోని సూరత్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దీంతో ఎన్డీఏ నేతలు ‘అబ్ కీ బార్ 399 పార్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా 1951 నుంచి ఇప్పటివరకు పోటీ లేకుండా ఎన్నికైన ఎంపీల సంఖ్య 35కు చేరుకుంది.
Similar News
News January 23, 2026
స్పేస్ అప్లికేషన్ సెంటర్లో 49 పోస్టులకు నోటిఫికేషన్

అహ్మదాబాద్లోని <
News January 23, 2026
లక్ష్మీదేవి కొలువై ఉండే పదార్థాలు ఇవే..

శాస్త్రాల ప్రకారం పాలు, పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, వీటిని గౌరవిస్తూ ఇల్లు శుభ్రంగా ఉంచుకునే వారిపై ఆమ్మవారి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఈ వస్తువుల పట్ల భక్తిశ్రద్ధలతో ఉండాలని పండితులు సూచిస్తున్నారు. సోమరితనం, కలహాలు ఉన్న చోట లక్ష్మి నిలవదని చెబుతున్నారు. వాటి పట్ల గౌరవంగా వ్యవహరిస్తే సంపద, ఐశ్వర్యం నిలకడగా ఉంటాయి.
News January 23, 2026
భాస్వరం, నత్రజని ఎరువులను ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనం?

పంట నాటిన/విత్తిన రెండు వారాలలోపే మొత్తం భాస్వరం ఎరువులను పంటలకు వేయాలి. పైపాటుగా వాడకూడదు. నత్రజని, పొటాష్ ఎరువులను పూతదశకు ముందే వేసుకోవాలి. సిఫారసు చేసిన మొత్తం నత్రజని ఎరువులను ఒకే దఫాలో కాకుండా మూడు దఫాలుగా (నాటిన/విత్తిన తర్వాత, శాఖీయ దశలో, పూతకు ముందు) వేయడం వల్ల పంటకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. సూక్ష్మపోషక ఎరువులను పంటకు స్ప్రే రూపంలో అందించాలి.


