News February 26, 2025
మళ్లీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ సినిమా

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ఆదిత్య 369’ మళ్లీ థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 1991లో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సమ్మర్లో ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. కాగా, ‘ఆదిత్య 369’కు సీక్వెల్ తీయనున్నట్లు ఇప్పటికే బాలయ్య ప్రకటించారు.
Similar News
News February 26, 2025
ఎగ్జామ్ టైమ్ అంటే లవర్స్ లేచిపోయే వేళ!

బిహార్లో బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దీంతో పేరెంట్స్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎందుకంటారా! ఇది లేచిపోయే టైమ్ కాబట్టి! ఇక్కడి పరీక్షల్లో పాసవ్వడం ఈజీ కాదు. పాసవ్వకుంటే అమ్మాయిలకు తల్లిదండ్రులు పెళ్లిచేసేస్తుంటారు. అందుకే ఎగ్జామ్పై డౌటుంటే ఎవర్నో చేసుకొనే బదులు తమ లవర్స్తో నుదుటున బొట్టు పెట్టించుకొని లేచిపోతారు. రీసెంటుగా ఓ యువతికి అబ్బాయి పాపిట సింధూరం పెట్టడం వైరల్గా మారింది.
News February 26, 2025
క్రిమినల్ పొలిటీషియన్స్పై ఆరేళ్ల నిషేధం చాలు: కేంద్రం

క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినవారు ఎన్నికల్లో పోటీచేయకుండా ఆరేళ్ల నిషేధం చాలని కేంద్రం అభిప్రాయపడింది. జీవితకాలం అనర్హత వేటు వేయడం కఠినమని సుప్రీంకోర్టుకు తెలిపింది. అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్పై స్పందించింది. ‘జీవితకాల నిషేధం సముచితం అవునో, కాదోనన్న ప్రశ్న పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. దానిని సభ నిర్ణయిస్తుంది. ప్రస్తుత శిక్షాకాలం సరైందే. నేర నియంత్రణకు సరిపోతుంది’ అని పేర్కొంది.
News February 26, 2025
కేసీఆర్కు కిషన్ రెడ్డి పార్ట్నర్: CM రేవంత్

TG: KCRకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్నర్ అని CM రేవంత్ అన్నారు. ‘KCR కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నారు. నాకు పేరొస్తుందని మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు’ అని ఆరోపించారు. SLBC టన్నెల్ ప్రమాదంపై మాట్లాడుతూ ‘పదేళ్ల నుంచి పనులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో 30కి.మీ మేర టన్నెల్ పూర్తయింది. తర్వాత తనకు లాభాలు రావడం లేదని KCR పనులను ఆపేశారు’ అని పేర్కొన్నారు.